కోట సునీల్ కుమార్ స్వామి సారధ్యంలో కరోన నివారణకు హోమం

గూడూరు, ఏప్రిల్.12.(అంతిమ తీర్పు ).:


కరోనా మహమ్మారి వలన ప్రపంచ దేశాలు నాశనం అవుతు ,ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో హిందూ ధర్మ పరిరక్షణ  జిల్లా కొ ఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో ఆదివారం గూడూరు పట్టణంలోనీ పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయంలో శ్రీ దుర్గాదేవి సన్నిధిలో కరోనా నివారణ, లోక రక్షణ కొరకు అమ్మ వారికి నవవరణ హోమం వేదపండితులతో కలిసి నిర్వహించారు, ఈ సందర్భంగా కోట సునీల్ కుమార్ స్వామి మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గ పీఠాధిపతులు వారి దివ్య ఆశీస్సులతో మరియు వారి ఆజ్ఞానుసారంగా కొరొనా నివారణకు మరియు లోక కల్యాణం కొరకు శ్రీ సాయి సత్సంగ నిలయంనందు అమ్మవారి నవావరణ హోమంతో పాటు ధన్వంతరి, ఔషధ చక్ర నారాయణ, దుర్గా త్రిశతి, యోగా వశిష్ట నందలి కర్కతోపాఖ్యానంలోని నారాయణ, నారాయణి బీజ సహిత విశేష హోమం నిర్వహించడం జరిగింది అన్నారు, ఈ కార్యక్రమంలో కోట ప్రకాశం స్వామి దంపతులు, కోట సునీల్ కుమార్ స్వామి దంపతులు, వేద పండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు,


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు