పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ...


.. వింజమూరు పంచాయతీ పరిధిలోని నార్త్ ఎస్సీ కాలనీలో సోమవారం గ్రామంలోని కుటుంబాలకు స్థానిక నివాసి నీసు చెన్నకేశవులు మహాలక్ష్మి దంపతులు నిత్యావసర సరుకులను తాసిల్దార్ ఎం. వి. కె. సుధాకర్ రావు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి రాజారావు చేతుల మీదగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సుధాకర్ రావు ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో గడిచిన ఒకటిన్నర నెల నుండి పనులు లేక పేదలు కుటుంబం గడవడం కష్టతరంగా మారింది. ఇలాంటి తరుణంలో గ్రామానికి చెందిన చెన్నకేశవులు దంపతులు ముందుకు వచ్చి వారు ఉంటున్న ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ముందుగా వారిని అభినందించాలి అన్నారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జూపల్లి రాజారావు మాట్లాడుతూ కేశవులు సభ్యులు కష్టే ఫలి అన్న సిద్ధాంతాన్ని నమ్మి బంగ్లా సెంటర్ లో చిన్న హోటల్ నిర్వహిస్తూ వారి పిల్లలను తాము పడ్డ కష్టం పడకూడదనే ఉద్దేశంతో బాగా చదివించారు అన్నారు. వారిలో ఒక అబ్బాయి బ్యాంకు ఉద్యోగం సంపాదించగా మరో అబ్బాయి గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. వారు ఇప్పుడు చేస్తున్న సహాయము మరువలేనిదన్నారు. ప్రతి ఒక్కరూ ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటికే పరిమితం కావాలన్నారు. అధికారులు సూచనలు సలహాలు పాటిస్తూ జీవనం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు నీసు బాలకృష్ణ. దళిత సంఘం నాయకులు వా గాల పెంచలయ్య
 తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు