కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజి వల్ల పేదలకు వచ్చే లాభం ఏంటి.. : ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు సుంకర పద్మశ్రీ సూటి ప్రశ్న

 


కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజి వల్ల పేదలకు వచ్చే లాభం ఏంటి.. : ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు సుంకర పద్మశ్రీ


కార్మికులను, వలస కూలీలను , రైతులను  పట్టించుకోకుండా... కేవలం పారిశ్రామిక వర్గాల పక్షంగా వ్యవహరించిన కేంద్రం


20 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో అర్థం కాక జుట్టు పీక్కుంటున్న పేదలు...


2014 నుండి అంధ్రప్రదేశ్ కు ఒక లక్ష కోట్లు ఇచ్చాము అని ఏవో కాకి లెక్కలు చూపించినట్లుగానే ఉండబోతుందా ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజి ??


కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ సామాన్యుడికి ఉపయోగం లేదని విమర్శించిన కాంగ్రెస్ నేత పద్మశ్రీ.


మరో సారి సూటు - బూటు సర్కారు అని రుజువు చేసుకున్న మోడీ ప్రభుత్వం... కాంగ్రెస్ నేత ఘాటు విమర్శ.


మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి ఇది ప్రజా ప్రభుత్వం కాదని నిరూపించారు.. 


కరోనా నుంచి దేశాన్ని కాపాడాల్సిన కేంద్రం.. ప్రజల జీవితాలు  గాలికి వదిలేసింది.


ఆర్థిక పరిపుష్టి పెంచే చర్యల పేరుతో... పేదల కడుపుకొడుతోంది.


వలస కూలీల పైన కరుణించని..  మోడి సంస్కరణల పేరుతో ఉన్న ఉపాధి పోగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన పద్మశ్రీ.


దేశంలో వలస కూలీలు సొంత గ్రామాలకు, స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతుంటే.. వారికి సౌకర్యాలు కల్పించకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించిన కాంగ్రెస్ నేత.


యతారాజ... తథా సీఎం అన్నట్లుగా రాష్ట్రంలో జగన్ పాలన.


వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను తీసుకురావడం... రాష్ట్రంలో ఉన్న వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపడం చేతకాదు... విదేశాల్లో ఉన్న వారిని తీసుకురావాలని లేఖలు రాస్తున్నారు.


రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం అయిన జగన్... వలస కూలీలను ఆకలితో చంపుతున్నారు.


ప్రచారం ఎక్కువ.. పని తక్కువ లో జగన్, ఆయన అనుయాయులను మించిన వారు లేరని నిరూపించారు.


ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యులు సుంకర పద్మశ్రీ


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు