భార్యను కాపురానికి పంపలేదని అత్తను దారుణంగా హతమార్చిన అల్లుడు .

భార్యను కాపురానికి పంపలేదని అత్తను దారుణంగా హతమార్చిన అల్లుడు ......


.ఏఎస్ పేట మండలం చౌటభీమవరం గ్రామానికి చెందిన మేకల పోలమ్మ 65ను అల్లుడు సోలా తిరుపాలు దారుణంగా హత్య చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది వివరాల్లోకి వెళితే చవట భీమవరం గ్రామానికి చెందిన మేకలబోయిన పోలమ్మకు ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారు కుమార్తె దొరసానమ్మకు మండలంలోని దూబగుంట గ్రామానికి చెందిన సోలా తిరుపాలు తో కొద్ది సంవత్సరాల క్రితం  వివాహమయ్యింది అప్పటి నుండి తరచూ ఏదో ఒక సమస్యపై గొడవ పడుతూ భార్యను తాగి వేధిస్తుండటంతో  భర్త వేధింపులు తాళలేక భార్య దొర్సానమ్మ తల్లి పోలమ్మ వద్ద ఉంటుంది అయితే అల్లుడు పోలయ్య అత్తను తరచూ భార్యకు కాపురానికి పంపాలని  చెప్తూ ఉండేవాడు అత్త తనభార్యను కాపురానికి పంప లేదన్న కోపంతో బుధవారం ఉదయం పోలయ్య అత్త ఇంటి ముందు కాపు కాసి అత్త పోలమ్మ నీళ్ల కోసం బయటికి రావడంతో ఒక్కసారిగా కత్తితో నరకడంతో పోలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది సమాచారం  తెలుసుకున్న ఆత్మకూరు సిఐ పాపారావు "పేట" ఎస్ఐ గోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు పారిపోతున్న నిందితుడు పోలయ్యను పోలీసులు పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు  ఈ సందర్భంగా ఆత్మకూరు సిఐ పాపారావు విలేఖరులతో మాట్లాడుతూ కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు అత్తను కత్తితో దాడి చేయడంతో పోలమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆయన తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు