భయం ఆందోళన తొలగించడం ద్వారానే సాధారణ పరిస్థితులు:  పీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్‌.జగన్

*11.05.2020,*
*అమరావతి.*


దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌పై కార్యాచరణను ప్రధాని ఈ కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.


*భయం ఆందోళన తొలగించడం ద్వారానే సాధారణ పరిస్థితులు: *
*పీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*


ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ :


– కేంద్రం సూచనలు, సలహాలకు అనుగుణంగా రెండు నెలల నుంచి చర్యలు,లాక్‌డౌన్‌లో కేంద్రం ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చింది.
– దాని వల్ల కేసులను నియంత్రించగలిగాం.
– రాష్ట్రంలో మూడు పర్యాయాలు సమగ్ర సర్వే నిర్వహించాం. దాదాపు 30 వేల మందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో, వారందరికీ పరీక్షలు నిర్వహించాం. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్ల ద్వారా సర్వే కొనసాగించాం. 
– 6 వారాల లాక్‌డౌన్‌ పరిస్థితులను సమీక్షించుకుంటే.. సాధారణ పరిస్థితులు నెలకొనే దిశలో చర్యలు తీసుకోవాల్సి ఉంది.
– కోవిడ్‌పై భయాందోళనను తొలగించలేకపోతే అడుగు ముందుకు వేయలేం. 
– కరోనా పాజిటివ్‌ లక్షణాలు గుర్తించిన కుటుంబాలు సమాజంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సమాజం వారిని వేరుగా చూస్తుందన్న భావన నెలకొంది, వివక్ష కనిపిస్తోంది. 
– ఈ కారణం వల్లనే కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పడం లేదు. ఇది మొత్తం కరోనా పరీక్షల ఉద్దేశం, లక్ష్యాలపై ప్రభావం చూపిస్తోంది.
– కరోనా కేసులు కనిపించిన ప్రాంతాలను క్లస్టర్లు, కంటైన్మెంట్‌ జోన్లుగా గుర్తించడం, అదే విధంగా సంస్థాగతంగా క్వారంటైన్‌ ప్రక్రియపై మరోసారి ఆలోచించాల్సి ఉంది.
– ఈ ప్రక్రియలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక వ్యూహంతో వ్యవహరించాల్సి ఉంది.
– కరోనా లక్షణాలు కనిపిస్తే స్వయంగా చెప్పడం, వైద్య సహాయం పొందడం, తమంతట తాముగా ఐసొలేషన్‌కు వెళ్లడం వంటివి కొనసాగాల్సి ఉంది.
– దాదాపు 98 శాతం కేసులు నయం చేయగలమన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది.
– 85 శాతం కేసుల్లో మైల్డ్‌ సింప్‌టమ్స్‌ మాత్రమే కనిపిస్తున్నాయి.
– కాబట్టి కరోనాకు వ్యాక్సిన్‌ కనుక్కొనే వరకు ఆ వైరస్‌లో మనం కలిసి ముందుకు సాగాల్సి ఉందన్న విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంది.
– భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, హ్యాండ్‌ శానిటైజర్ల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం.. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యమైనవి.
– వర్క్‌ ప్లేస్‌లు, ఉత్పత్తి కేంద్రాలు (మానుఫ్యాక్చరింగ్‌ యూనిట్లు), మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో ఒక స్పష్టమైన ప్రామాణికత (ఎస్‌ఓపీ)ను రూపొందించాల్సి ఉంది.


– అవసరమైన శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లు, కోవిడ్‌–19 సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా, కరోనా వ్యాధి లక్షణాలు కనిపించిన ప్రజలు ఎలాంటి భయం, సంకోచం లేకుండా తమంతట తాము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్ష చేయించుకోవడం, వైద్యం పొందేలా ప్రోత్సహిస్తున్నాం.
– వాటితో పాటు, టెలి మెడిసిన్, కాల్‌ సెంటర్లు కూడా కరోనా సోకిన వారికి పరీక్షలు, చికిత్స చేయడంలో తమ వంతు పాత్ర పోషించనున్నాయి.
– హైరిస్క్‌ ఉన్న వారికి మరింత అవగాహన కల్పించడంతో పాటు, హోం ఐసొలేషన్‌కు సంబంధించి ప్రజలకు కూడా అవగాహన కల్పించాల్సి ఉంది.
– వృత్తాలు గీయడం ద్వారా ప్రజలు భౌతిక దూరం పాటించేలా చేయడం, స్వీయ క్వారంటైన్‌కు సంబంధించి కూడా ఒక వ్యూహం రూపొందించాల్సి ఉంది. 
– అయితే వీలైనంత వరకు వాటి నుంచి బయట పడాల్సి ఉంది.
– మీడియాలో కరోనాపై భయాందోళనలు పెంచే కధనాల కన్నా, వాస్తవాలను చెబుతూ, దాదాపు 95 శాతం వరకు ఈ వ్యాధిని నయం చేయవచ్చన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలి.
– ప్రతి ఒక్కరికి స్పష్టమైన అవగాహన కల్పించడం ద్వారా, ఎవరికి వారు వ్యక్తిగతంగా పూర్తి జాగ్రత్తలు పాటించడంతో పాటు, వారి కుటుంబాలను కూడా కాపాడుకునే విధంగా మార్చాల్సి ఉంది.
– ఆ ప్రక్రియ కోసం ఇప్పుడున్న వైద్య విధానం, వ్యవస్థలో చాలా మార్పులు తీసుకు రావాల్సి ఉంది.
– కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా ఆస్పత్రుల్లో పడకలు పెంచాం. ఐసీయూ బెడ్లు కూడా చాలా ఏర్పాటు చేశాం. కానీ వాటిని ఇంకా ఇంకా పెంచాల్సి ఉంది.
– వైద్య ఆరోగ్య రంగంలో గ్రామ స్థాయి నుంచి అత్యున్నత స్థాయిలో టీచింగ్‌ ఆస్పత్రుల స్థాయిలో కూడా సమూల మార్పులు తీసుకువచ్చే దిశలో రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది.
– రోజులో 24 గంటల పాటు పని చేసే సిబ్బందితో గ్రామ క్లినిక్‌లు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నాం.
– పార్లమెంటు నియోజకవర్గంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా చాలా మందికి వైద్య సేవలు అందించడంతో పాటు, వాటిలో వైద్యులు, నర్సుల కొరత కూడా ఉండబోదు.
– అదే విధంగా అన్ని ఆస్పత్రులను సమూలంగా మార్చి, జాతీయ స్థాయిలో వాటిని తీర్చి దిద్దాల్సి ఉంది. 
– గ్రామాల్లో పని చేసే క్లినిక్‌లు కూడా ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండాల్సి ఉంది. ఎవరికి ఏ జబ్బు లక్షణాలు కనిపించినా, ఆ క్లినిక్‌లకు వెళ్లి వైద్య సలహాలు పొందాలి. అవసరమైతే చికిత్స కూడా అందించాలి. ఆ స్థాయి ప్రమాణాలతో అవి పని చేయాల్సి ఉంది.
– ఇక గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు జోరుగా సాగాల్సి ఉంది. ఇందుకు స్థానిక సంస్థలకు ఎన్నో నిధులు కావాలి.


– తయారీ రంగం పుంజుకోవాలంటే ముడిసరుకులు అందడం, ప్రజల రాకపోకలు (మూమెంట్‌) అనేది చాలా అత్యవసరం. 
– సరుకుల రవాణాకు అనుమతించినప్పటికీ చాలా రాష్ట్రాల్లో అవరోధాలు ఏర్పడుతున్నాయి. 
– మా రాష్ట్రంలో తయారీ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. 
– దేశవ్యాప్తంగా మార్కెట్లు, రిటైల్‌ రంగం మూతబడి ఉండడంతో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ లేదు. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు మిగులు కనిపించి.. తీవ్రంగా దెబ్బ పడుతోంది. మరోవైపు రాష్ట్రంలో వినియోగం తక్కువ. 
– రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా పైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంటకూ కనీస మద్దతు ధర ప్రకటించింది.
– రాష్ట్రాల మధ్య రవాణాకు సంబంధించి పూర్తి అవరోధాలు తొలగిపోవాలి. 
ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఒక డ్రైవర్‌ సరుకులను ఎక్కడికకైనా సరే తీసుకు వెళ్లగలననే భరోసా ఉండాలి. తనను ఎవ్వరూ కూడా నిర్బంధించరని, క్వారంటైన్‌ చేయరనే నమ్మకం ఆ డ్రైవర్‌కు కలగాలి.
– సరకుల రవాణా సాధారణ స్థాయిలో జరగకుండా, వలస కూలీలు, కార్మికులు ఆయా ఫ్యాక్టరీల్లో పని చేయగలిగే పరిస్థితులు లేకుండా, రాష్ట్రాల సరిహద్దుల వద్ద సాధారణ పరిస్థితులు తలెత్తకుండా... ఆర్థిక వ్యవస్థ మళ్లీ పునరుజ్జీవం కాదు. 
– ప్రజలకు తమ పనులకు వెళ్లాంటే.. ప్రజా రవాణా అందుబాటులో లేదు. 
ప్రజా రవాణా రంగం మీద ఉన్న ఆంక్షలను తొలగించాలి. 
– వలస కార్మికులైనా, విధులకు హాజరయ్యే వారైనా సరే.. వారికి ప్రజా రవాణా అందుబాటులోకి తీసుకు రాలేకపోతే.. ఆర్థిక వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకోదు. 
– వివిధ రాష్ట్రాల్లోని పరిశ్రమల్లో పని చేస్తున్న కూలీలు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోవడం చూస్తున్నాం. వారు తాము పని చేసిన చోటుకి తిరిగి రాకపోతే సాధారణ పరిస్థితులు తిరిగి రావు. వారిలో భయం, ఆందోళన తొలగిపోవాలి. 
– బస్సుల్లో సరిపడినంత భౌతిక దూరం పాటించాలి. ప్రజారవాణాలో మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి చేయాలి. 
– షాపింగ్‌ సెంటర్లు కూడా తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తూనే భౌతిక దూరం పాటించాలి, మాస్క్‌లు ధరించేలా చూడాలి. 
– వీటిని సరిగ్గా అమలు చేసేలా స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)లను అందుబాటులోకి తీసుకురావాలి. 
– భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు దరించేలా, వ్యక్తిగత శుభ్రత పాటించేలా నియమాలు, నిబంధనలను తీసుకురావాలి. 
–అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 
ఆస్పత్రులు, ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కనీసం రూ.16 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఈ విషయంలో కొత్త రాష్ట్రంగా మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కావాలి, కేంద్రం నిధులు ఇవ్వాలి. 
– దీనికి  తోడు.. వడ్డీలు లేని లేదా వడ్డీలు తక్కువగా ఉండే దీర్ఘకాలిక చెల్లింపుల ప్రాతిపదికన రుణాలు ఇవ్వాలి. గ్రామ స్థాయి నుంచి బోధనాసుపత్రుల వరకూ ఆస్పత్రులన్నింటినీ కూడా జాతీయ ప్రమాణాల స్థాయికి అభివృద్ది చేయాలనే లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటాం. 
– రాష్ట్రానికి అవసరమైన మరో 16 టీచింగ్‌ ఆస్పత్రులను కూడా ఏర్పాటు చేస్తాం.
– ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఇచ్చే ఈ రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకురాకుండా ఉండాలని కోరుతున్నాం. 
– ఇతర రంగాలకు నిధుల కొరత రాకుండా ఈ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
– రాష్ట్రంలో దాదాపు 87 వేలకు పైగా ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉన్నాయి. 
9.7లక్షల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. 
– ప్రతి యూనిట్లో కనీసం 10 మంది ఉద్యోగాలు పొందుతున్నారు. 
ఈ రంగానికి చేయూతనివ్వకపోతే.. కుప్పకూలిపోతుంది. 
– ఎంఎస్‌ఎంఈ రంగం స్తంభించి పోతే.. నిరుద్యోగం అన్ని చోట్లా పెరుగుతుంది. 
– అందువల్ల 6 నెలలు, అంటే 2 త్రైమాసికాలు ఎంఎస్‌ఎంఈలకు వడ్డీమాఫీ చేయాలి. 


– ఇక వ్యవసాయం విషయానికొస్తే.. ఉద్యానవన పంటలతో పాటు మరిన్ని పంటలకు కనీస మద్దతు ధరలను ప్రటించాలి.
– సేకరణలో ప్రస్తుతం ఉన్న పరిమితిని 30 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. అన్ని రాష్ట్రాల్లో హోల్‌సేల్‌ మార్కెట్లను తెరవాలి.
– రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. కేంద్ర సహకారం కావాలి. 
– రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు బాగుంటేనే.. పేదలకు మేలు జరుగుతుంది.
– లాక్‌డౌన్‌ సడలింపు చర్యల సమయంలో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను.
–పౌరులంతా సాధారణ జీవితాలు గడపడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. 
– దీని వల్ల డాక్టర్లు, నర్సుల కొరత ఉండదు.
గ్రామ స్థాయిలో క్లినిక్‌లు ముఖ్యపాత్ర పోషించనున్నాయి.
– లాక్‌డౌన్‌ నిరంతర కొనసాగింపు ఆర్థికంగా కుంగదీస్తుంది.
అంతర్‌రాష్ట్ర సరిహద్దుల్లో నియంత్రణ ఎత్తివేయాలి. రాకపోకలకు అనుమతి ఇవ్వాలి.
– బస్సులు, ప్రజా రవాణా వ్యవస్థలో భౌతిక దూరం పాటించడంతో పాటు, శానిటైజేషన్‌ కొనసాగుతుంది.


Popular posts
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
*ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా శ్రీనివాసులురెడ్డి* వింజమూరు, ఆగష్టు 22 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ఉత్తమ పంచాయితీ కార్యదర్శిగా మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి, వింజమూరు మరియు చాకలికొండ పంచాయితీల సమన్వయ సెక్రటరీ బంకా. శ్రీనివాసులురెడ్డి ఎంపికయ్యారు. ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సంధర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ అధికారుల పేర్లును జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించడం ఆవవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా ఈ యేడాది శ్రీనివాసులురెడ్డి ఉత్తమ అధికారుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత 5 సంవత్సరాల క్రితం మండలంలోని చాకలికొండ పంచాయితీ కార్యదర్శిగా నియమింపబడిన బంకా. శ్రీనివాసులురెడ్డి విధి నిర్వహణలో భాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమర్ధవంతమైన పంచాయితీ సెక్రటరీగా పేరు తెచ్చుకున్నారు. తరువాత ఆయనను వింజమూరు మేజర్ పంచాయితీ ఇంచార్జ్ ఇ.ఓగా కూడా ఉన్నతాధికారులు నియమించడం జరిగింది. చురుకైన స్వభావం కలిగిన శ్రీనివాసులురెడ్డి ప్రస్తుతం మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి గా అదనపు విధులలో కొనసాగుతున్నారు. కరోనా సమయంలో వింజమూరులో శ్రీనివాసులురెడ్డి సేవలు పతాక శీర్షికలలో నిలిచాయి. పారిశుద్ధ్యం మెరుగుకు పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులను ముందుండి నడిపించారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలలో పగలూ రేయీ అనే తేడా లేకుండా నిరంతర పర్యటనలు చేసి బ్లీచింగ్, హైపోక్లోరెడ్ ద్రావణాలు చల్లించి సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న శ్రీనివాసులురెడ్డి ఉత్తమ పంచాయితీ సెక్రటరీగా ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు గానూ విధి నిర్వహణలో తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ, తహసిల్ధారు సుధాకర్ రావు, రక్షణ వలయాధికారి బాజిరెడ్డి తదితర మండల స్థాయి అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులకు, సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లుకు, జర్నలిస్టులకు, వింజమూరు, చాకలికొండ గ్రామ పంచాయితీల ప్రజలకు ధన్యవాదములు తెలియజేశారు.
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
అంధకారమయ ప్రపంచంలో కాంతిని పెంచడానికి మీ కళ్లని దానం చేయడమే ఒక మహోన్నత కార్యం 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ దేశ వ్యాప్తంగా నిర్వహించే కంటి దాన వారోత్సవాల సందర్భంగా కళ్ల దానం గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు చూపు మనిషికి దేవుని ద్వారా ప్రధానమైన ఐదు ప్రధానమైన లక్షణాలైన వాసన, తాకడం, వినడం మరియు రుచి లలో ఒకటి. అందులో చూపు కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే చూపు మానవుని జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది కావున దీనిని పోగొట్టుకోవడం లేదా అంధత్వాన్ని పొందడం మానవుని వ్యక్తిగత జీవన పయనంలోనే కాకుండా అతని కుటుంభలోనూ విపరీతమైన ప్రభావం చూపుతుంది. మనిషి ప్రతి రోజూ నిర్వహించే దైనిందిన కార్యక్రమాలైన నడక, చదవగలుగడం, ఇతరులతో మాట్లాడడం, చదువు లేదా ఉద్యోగావకాసాలు దెబ్బతినడం, సమాజిక వ్యవస్థలను వినియోగించుకొనే సామర్థ్యం దెబ్బతినడం లాంటి ఎన్నో ఇబ్బందులను చూపు కోల్పోయిన వారు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇలాంటి ఎన్నో ఇబ్బందులను మనం కంటిని పరిరక్షించుకోవడం లేదా అవసరమైన చికిత్సను పొందడం ద్వారా దూరం చేసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్ ప్రజలు అంధత్వం లేదా చూపు సరిగ్గా కనిపించకపోవడం వంటి ఇబ్బందులతో భాదపడుతున్నారు. ఇలా భాదపడుతున్న వారిలో 1 బిలియన్ అంటే సగానికి పైగా మనుషులలో ఈ ఇబ్బందిని సరైన చికిత్స అందించడం ద్వారా దూరం చేయవచ్చు. ఇక కంటి ఇబ్బందులతో భాదపడుతున్న వారిలో 123.7 మిలియన్ సంఖ్యలో ప్రజలు రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ను సరైన సమయంలో చికిత్స ద్వారా నయం చేయకపోవడంతో అంధత్వం బారిన పడుతున్నారని, 4.2 మిలియన్ మంది కార్నియల్ బ్లైండ్ నెస్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని తెలుస్తోంది. ఇక 65.3 మిలియన్ ప్రజలు కాటరాక్ట్ కారణాగా 6.9 మిలియన్ ప్రజలు గ్లుకోమా వలన తర్వాత చివరగా 10.4 మిలియన్ సంఖ్యలోని ప్రజలు వయస్సు మీద పడిన కారణంగా తలెత్తే మాక్యులర్ డీజనరేషన్ కారణంగా అంధత్వాన్ని పొందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంఖ్య చెబుతోంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్న వివరాల ప్రకారం ఎక్కువ శాతం అంధత్వం బారిన పడుతున్న వారిలో 50 సంవత్సరములకు పైబడిన వారుంటున్నారని అయితే మిగిలిన వయస్కులు కూడా ఈ కోవలో చేరుతున్నారని తెలుస్తుంది. ఇక అంధత్వం లేదా చూపు తగ్గిపోవడం బారిన ఎక్కువగా పేద లేదా అభివృద్ది చెందుతున్న దేశ ప్రజలు పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది...ఇందుకు ప్రధానంగా ఆయా దేశాలలో సరైన చికిత్సా సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే కారణమని స్పష్టం చేస్తోంది. ఇక మరింత ఆందోళన కలిగించే అంశమేమిటంటే ప్రపంచంలోని అంధులలో 50 శాతం భారత దేశంలోనే ఉండడం. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 2020 నాటికి 10.6 మిలియన్ ప్రజలు కార్నియల్ బ్లైండ్ నెస్ బారిన పడుతున్నారని తెలుస్తోంది. ఇలా చూపు కోల్పోతున్న వారిలో 3 మిలియన్ ప్రజలకు కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసి కొత్త కార్నియా పెట్టడం ద్వారా చూపు తెప్పించవచ్చు. వీరందరికీ కార్నియా అందజేసి చూపు తెప్పించాలంటే ఏటా 1,50,000 కార్నియా ట్రాన్స్ ప్లాంట్ శస్త్ర చికిత్సలను ఏటా మన దేశంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించి తద్వారా కార్నియల్ బ్లైండ్ నెస్ ను రూపుమాపాలంటే చనిపోయిన వ్యక్తి ద్వారా కళ్లను సేకరించడమే మార్గం. అందుకే ఏటా 25 ఆగష్టు నుండి 7 సెప్టెంబర్ వరకూ ఏటా కంటి దానం పై దేశ వ్యాప్తంగా కంటి దాన వారోత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కంటి దానంపై అవగాహన కలిపించడానికి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కంటి దానానికి సంబంధించిన పలు అంశాలను డా. అల్వా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్, కొండాపూర్ వారి ద్వారా తెలుసుకుందాం.... కంటి దానమంటే ఏమిటి? ఒక వ్యక్తి (పురుషుడు లేదా మహిళ) చనిపోయిన తర్వాత వారి కళ్లను ఇతరులకు అమర్చడానికి వీలుగా దానం చేయడం. కంటి బ్యాంక్ (eye bank) అంటే ఏమిటి? కంటి బ్యాంక్ లేదా ఐ బ్యాంక్ లనేవి లాభాపేక్ష లేకుండా కంటి దానానికి అంగీకరించిన వ్యక్తులు చని పోయిన తర్వాత వారి నుండి కళ్లను సేకరించి, భద్రపరచి, సరైన రీతిలో పరీక్షించి అవసరమైన వారికి అందజేసే వ్యవస్థలు. ఈ వ్యవస్థను మొదటి సారిగా 1944 లో న్యూయార్క్ నగరంలో డా. టౌన్ లే పాటన్ మరియు డా. జాన్ మెక్లీన్ లు ప్రారంభించారు. భారత దేశంలో 1945 లో ఐ బ్యాంక్ ను డా. RES ముత్తయ్య, దేశంలోనే మొదటి విజయవంతంగా నిర్వహించబడిన కార్నియా మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్యునిచే చెన్నయి లోని రీజనల్ ఇన్సిస్టిట్యూట్ ఆప్తమాలజీ వారు ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకూ దేశ వ్యాప్తంగా ఉన్న కంటి వైద్యులు, శస్త్ర చికిత్స నిపుణులు, ప్రజలు దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ప్రజలలో అవగాహన కలిపిస్తున్నారు. హైదరాబాదులో ఉన్న ఐ బ్యాంకు లు.... 1. రామాయమ్మ అంతర్జాతీయ ఐ బ్యాంక్, యల్ వి ప్రసాద్ ఐ ఇన్సిస్టిట్యూట్, బంజారా హిల్స్ 2. చిరంజీవి ఐ మరియు బ్లడ్ బ్యాంక్, జూబ్లీ హిల్స్, హైదరాబాదు 3. ఐ బ్యాంక్, సరోజిని దేవి కంటి హాస్పిటల్, హైదరాబాదు 4. మాదవ నేత్ర నిధి, పుష్పగిరి విట్రోరెటీనా ఇన్సిస్టిట్యూట్ 5. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆప్ ఇండియా కార్నియల్ బ్లైండ్ నెస్ లేదా అంధత్వం అంటే ఏమిటి? కార్నియా అనేది కంటిలో అత్యంత బాహ్యమైన లేదా మొదలు భాగంలో ఉండే పారదర్శకత్వంతో కూడిన కంటి భాగం. ఇది రంగులు కలిగి ఉండేలా కనిపిస్తుంది. ఈ కార్నియా వెనుకాల భాగంలో ఐరిస్ అనబడే భాగం ఉంటుంది. ఈ ఐరిస్ ఉండే రంగును బట్టి కళ్లు బ్రౌన్, బ్లాక్, బ్లూ లేదా గ్రీన్ కలర్స్ లో కనిపించడం జరుగుతుంది. కార్నియా పారదర్శకంగా ఉండి మనం చూసే ఆకృతి యొక్క ప్రతిబింబం ను రెటీనా పై పడేలా చేస్తుంది. ఈ కార్నియా తన పారదర్శకతను కోల్పోతే చూపు తగ్గిపోవడం కాని పూర్తిగా లోపించడం జరుగుతుంది. కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్స ఉందా? కార్నియల్ బ్లైండ్ నెస్ కు చికిత్సగా దెబ్బతిన్న కార్నియా ను తొలగించి ఆరోగ్యమైన కార్నియా తో మార్పిడి చేయడం అంటే పూర్తిగా గాని లేదా పాక్షికంగా కాని చేయాలి. ఈ మార్పిడిని చని పోయిన వారి కళ్ల నుంచి సేకరించిన కార్నియా ద్వారా చేస్తారు. బ్రతికున్న వారు కళ్లను దానం చేయవచ్చా? లేదు. బ్రతికున్న వారు దానం చేయడానికి అనర్హులు. నా కళ్లను నేను ఎలా దానం చేయగలను? ఒకరి కళ్లను దానం చేయడానికి నిర్ణయించుకొన్నపుడు వారు ఐ బ్యాంక్ లను కలిగిన హాస్పిటల్స్ లేదా సంస్థలను సంప్రదించి తత్సంబదిత ధరఖాస్తును నింపాలి. వీటిని ప్రస్థుతం ఆన్ లైన్ లో కూడా నింపవచ్చు. http://ebai.org/donator-registration/ పైన పేర్కొన్న లింక్, ఐ బ్యాంక్ అపోసియేషన్ ఆఫ్ ఇండియా వారిది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని ముందుగా కుటుంభ సభ్యులకు తెలిపి వారి సమ్మతి తీసుకోవడం అవసరం. దానితో పాటూ ఐ బ్యాంక్ వారి ఫోన్ నెంబర్లను భద్రపరుచుకోవడంతో పాటూ దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులు వెను వెంటనే ఐ బ్యాంక్ వారికి అంటే చనిపోయిన 6 గంటలలోగా తెలయచేయాలి. ఇందుకు చనిపోయిన వ్యక్తి ఎక్కడ ఉన్నాఆ ప్రాంతంలోని ఐ బ్యాంక్ ను సంప్రదించవచ్చు. చనిపోయిన వ్యక్తి కళ్లను ఐ బ్యాంకు వారు తీసుకొనే వరకూ కంటిపై తడి గుడ్డను ఉంచడం ద్వారా వాటిని కాపాడాలి. ఐ బ్యాంక్ ను ఎలా సంప్రదించాలి? భారత దేశంలో ఐ బ్యాంకును సంప్రదించడానికి ఉన్న కాల్ సెంటర్ నెం. 1919. దీనికి కాల్ చేయడం పూర్తిగా ఉచితం మరియు భారత దేశమంతా 24 గంటలూ అన్ని రోజులు పని చేస్తుంది. అంతే గాకుండా స్థానికంగా ఉన్న ఐ బ్యాంకులను నేరుగా సంప్రదించవచ్చు. ఐ బ్యాంకుకు వ్యక్తి మరణ సమాచారం తెలిపినపుడు ఏం జరుగుతుంది? వ్యక్తి మరణించిన వెంటనే ఐ బ్యాంకు కు మీరు కళ్ల దానం చేయాలన్న విషయాన్ని తెలియజేసిన వెంటనే కంటి వైద్యునితో కూడిన నిపుణుల బృందం వెంటనే మీ ఇంటికి చేరుకుంటుంది. ముందుగా కుటుంభ సభ్యులకు వారు విషయాలపై పూర్తిగా అవగాహన కలిగించి తగిన అనుమతులు తీసుకొన్న తర్వాత చని పోయిన వ్యక్తి సంబంధించిన సమాచారం సేకరిస్తారు. వెంటనే చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకు ఎటువంటి అంతరాయం కలుగని రీతిలో 10 నుంచి 15 నిమిషముల వ్యవధిలో ఈ నిపుణుల బృందం కళ్లను సేకరిస్తుంది. పూర్తిగా వ్యక్తిగత రక్షణ కలిపించే రీతిలో ఎవరికీ కనిపించకుండా వీరు తమ పనిని పూర్తి చేస్తారు. పూర్తయిన పిమ్మట మనిషి శరీరంలో ఎటువంటి ఛాయలు లేకుండా పూర్తిగా సాధారణ స్థితిలో కనిపించేలా చేసి పరిసరాలను శుభ్రం చేస్తారు. అంటే అసలు అక్కడ ఇలాంటి పని జరిగిందన్న ఆనవాలు కూడా లేకుండా సరి చేయడం, శుభ్రం చేయడం చేస్తారు. అనంతరం నిపుణులు బృందంలో ఉండే సోషల్ వర్కర్ కుటుంభ సభ్యులకు కళ్ల దానానికి సంబంధించిన ప్రత్యేక సర్టిఫికేట్ను అందజేసి సేకరించిన కళ్లను వెంటనే ఐ బ్యాంక్ కు తరలిస్తారు. ఇలా సేకరించిన కళ్లను మూడు నుండి నాలుగు రోజులలోగా ఇతరులకు వినియోగించడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో వీటిని ఎక్కువ కాలం కూడా భద్ర పరచడం జరుగుతుంది. ఇక దాత మరియు దానం స్వీకరించిన వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సాధారంగా కళ్లను ఎవరికి అమర్చారన్న సమాచారాన్ని దానం చేసిన వ్యక్తి కుటుంభ సభ్యులకు అందజేయరు. కంటిని దానం చేసిన తర్వాత చనిపోయిన వ్యక్తి ముఖం ఎలా ఉంటుంది? చనిపోయిన వ్యక్తి కళ్లను తీయడానికి రెండు పద్దతులు ఉపయోగిస్తారు. కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో కొంత రక్తస్రావం జరుగవచ్చు. అయితే అది ఎక్కువగా కాకుండా నిపుణులు శిక్షణ పొంది ఉంటారు. ఇలా కంటిని తొలగించిన తర్వాత ఆ ప్రదేశంలో ప్లాస్టిక్ షీల్డ్ ను కాని లేదా కాటన్ ప్లగ్ ను పెడుతారు. తద్వారా మనిషి ముఖంలో ఎలాంటి మార్పులు గోచరించవు. కంటిని ఎవరు దానం చేయవచ్చు? ఏ వ్యక్తి వయస్సు లేదా లింగభేధం లేకుండా కళ్లను దానం చేయవచ్చు. అయితే ఐ బ్యాంకుల వారు కంటి దానాన్ని 2 నుంచి 70 సంవత్సరముల వయస్సు కలిగిన వారి నుండి సేకరిస్తుంటారు. ఇక డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్థమా, ట్యూబర్ కులోసిస్ వంటి రుగ్మతలు ఉన్న వారితో పాటూ కంటి అద్దాలను ధరించే వారు, కాటరాక్టు శస్త్ర చికిత్సను చేయించుకొన్న వారు కూడా దానం చేయవచ్చు. ఇక లాసిక్ సర్జరీ చేసిన వారు కూడా దానాన్ని చేయవచ్చు. ఒక వ్యక్తి చేసే దానం ద్వారా నలుగురు అంధులు కంటి చూపును పొందే అవకాశం ఉంది. కంటి దానానికి అనర్హులు ఎవరు? Rabies, Tetanus, AIDS, Jaundice, Cancer, Gangrene, Septicemia, Meningitis, encephalitis, Acute Leukemia, Cholera ల వంటి వ్యాధులతో పాటూ ఫుడ్ ఫాయిజినింగ్ లేదా మునిగిపోవడం ద్వారా చని పోయిన వారు కంటి దానం చేయడానికి అనర్హులు. ఈ విషయాన్ని కంటిని సేకరించే ముందు నిపుణులు బృందం సంబంధిత కుటుంభ సభ్యులకు ఖచ్చితంగా తెలియజేసిన తర్వాత కంటిని సేకరించడం జరుగుతుంది. కోవడ్ మహమ్మారి సందర్భంగా కంటి దానం చేయవచ్చా? కోవిడ్ మహమ్మారి సమయంలోనూ కంటి దానం చేయవచ్చు. అయితే మహమ్మారి విసిరిన సవాళ్ల నేపధ్యంలో శస్త్ర చికిత్సలు చేయడంలో వస్తున్న ఇబ్బందుల కారణంగా కంటి దానాలు లేదా కళ్లను సేకరించే ప్రక్రియకు ఆటంకం కలిగింది. అయితే ఈ మహమ్మారి తగ్గిన తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. ఇలా దేశంలో ఉన్న అందత్వ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎక్కువ సంఖ్యలో దీనిపై అవగాహన కలిగించుకొని కంటి దానం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఉన్న మూడ నమ్మకాలు, అపోహలు, అడ్డంకిగా ఉన్న ఆచారాలు వంటి వాటిని దాటి సరైన అవగాహనతో కంటిని దానం చేసినట్లైతే ఎందరికో కళ్లను ఇవ్వడానికి దోహదపడవచ్చు. ఇప్పటికే కృత్రిమ కార్నియాపై పలు పరిశోధనలు జరుగుతున్నాయి, అయితే ఈ పరిశోధనలు విజయవంతం అయ్యే వరకూ చూపు కోల్పోతున్న వారికి దానం చేసే కళ్లు మాత్రమే తిరిగి జీవనాన్ని, ప్రకాశాన్ని ఇవ్వగలుగుతాయి. ఈ ఆర్టికల్ ను తయారు చేసిన వారు.... డా. అల్పా అతుల్ పూరబియా, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ మరియు అపోలో క్లినిక్స్, కొండాపూర్, హైదరాబాదు. 24 సంవత్సరముల అనుభవం కలిగిన వైద్యునిగా Cataract, Cornea and Refractive laser surgeries [Like Surface ablation/PRK, LASIK- with or without blade- Femto LASIK, ReLEx SMILE, and Phakic lens (ICL, IPCL, Eyecryl) & Keratoconus solutions] కు సంబందించి
Image
టిడిపి సీనియర్ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం