కోడి పందేల స్థావరాలపై ఎస్.ఐ మెరుపు దాడులు - 16 బైకులు, రూ.11,500 నగదు స్వాధీనం - 8 మంది అరెస్ట్.

కోడి పందేల స్థావరాలపై ఎస్.ఐ మెరుపు దాడులు - 16 బైకులు, రూ.11,500 నగదు స్వాధీనం - 8 మంది అరెస్ట్... వింజమూరు, మే 3(అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): వింజమూరు మండలం కాటేపల్లి పంచాయితీ పరిధిలోని మాధవనగర్ పొలాలలో ఆదివారం మధ్యాహ్నం కోడి పందేల స్థావరాలపై ఎస్.ఐ బాజిరెడ్డి మెరుపు దాడులు నిర్వహించారు. వివరాలలోకి వెళితే మాధవనగర్ పొలాలలో ఆదివారం నాడు పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు ఎస్.ఐ బాజిరెడ్డికి ముందస్తు సమాచారం అందింది. ఈ నేపధ్యంలో ఎస్.ఐ తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. కాటేపల్లి పరిసరాలలో కానిస్టేబుళ్ళను మఫ్టీలో ఉంచి నిఘా ఏర్పాటు చేశారు. వారి నుండి ఎప్పటికప్పుడు వస్తున్న సమాచారంతో కోడి పందేలు జరుగుతున్నాయని నిర్ధారించుకుని ఒక్కసారిగా దాడులు చేశారు. పలువురు తప్పించుకోగా 8 మంది కోడి పందెం రాయుళ్ళను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 11 వేల 500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఉన్న 16 ద్విచక్ర వాహనాలను రెండు ట్రాక్టర్లు పిలిపించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా సరే పేకాట, కోడి పందేలు, మద్యం బెల్టు షాపులు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్బడితే ఉపేక్షించేది లేదన్నారు.ఇలాంటి వాటిపై తాము ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందన్నారు. మండల ప్రజలందరూ కూడా వీటి నియంత్రణ దిశగా కృషి చేయాలని కోరారు. తన మొబైల్ నెంబరు 9440796375 కు సమాచారం అందించాలని, వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో ప్రజలందరూ కూడా స్వీయ నిర్భంధంలో ఉండి కరోనా వైరస్ ను కట్టడి చేయాల్సిన అవసరముందన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు