మే 2 న ఘనంగా జరిగిన యుగపురుషుడు నందమూరి తారకరామారావు  పెళ్లి రోజు

   బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దేవాలయాన్ని ఎంతో ముందు ఆలోచనతో కాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కరికి తక్కువ ఖర్చుతో వీలైతే ఉచితం గా మెరుగైన వైద్యం అందించాలని గొప్ప ఆశయంతో స్థాపించిన మహానుభావులు కీ.శే.  శ్రీ నందమూరి తారకరామారావు  పుణ్య దంపతుల పెళ్లి రోజు సందర్భం గా   మే 2 న  హాస్పిటల్ చైర్మన్  నందమూరి బాలకృష్ణ  హాస్పిటల్ కి విచ్చేసి పూల మాలలతో ఆ పుణ్య దంపతులకు నివాళులు అర్పించారు. 


అంతేకాక ఇదే రోజు  హాస్పిటల్ బోర్డ్ మెంబెర్ అయిన కీ.శే. డా. శ్రీ కోడెల శివప్రసాదరావు  పుట్టినరోజు సందర్భం గా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించటం జరిగింది. 


తర్వాత చైర్మన్ బాలకృష్ణ  అమ్మ నాన్న ల తో గడిపిన మధురానుభూతులు మరియు మన హాస్పిటల్ స్థాపించటానికి గల కారణాలను, కోడెల  కృషిని గుర్తుచేసుకుని విలువైన సమాచారాన్ని అందరికి తెలియచేయటం జరిగింది. దీనితో పాటు గా పేదవారికి అన్నదానం చేశారు.


తర్వాత హాస్పిటల్ వైద్యులతో సంప్రదింపులు జరిపి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఇంకా ఏమైనా మెరుగుపరచడానికి సలహాలు తీసుకుని మరియు కోవిడ్-19 గురించి తీసుకుంటున్న / పాటిస్తున్న జాగ్రత్త లు స్వయం గా పరిశీలించి విలువైన సలహాలు ఇవ్వటం జరిగింది.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు