వింజమూరు మండలం నల్లగొండ్లలో 2 కరోనా పాజిటివ్ కేసులు

వింజమూరు మండలం నల్లగొండ్లలో 2 కరోనా పాజిటివ్ కేసులు


వింజమూరు, మే 17 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండలం నల్లగొండ గ్రామానికి చెందిన వ్యక్తులు చెన్నై నుండి వచ్చి కోరం టైమ్స్ లో ఉన్నారు. వారికి ఆదివారం ప్రభుత్వ వైద్యాధికారి హరికృష్ణ కోవిడ్-19 క్విట్లు ద్వారా 15 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు తాసిల్దార్ ఎం వి సుధాకర్ రావు తెలిపారు. ప్రాథమిక పరీక్షలో పాజిటివ్ రావడంతో వారిని నెల్లూరు తరలించి ల్యాబ్ ద్వారా పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేయవలసి ఉందని ఎస్సై బాజిరెడ్డి తెలిపారు. ప్రత్యేక అంబులెన్స్ ద్వారా వారిని నెల్లూరు     104 అంబులెన్స్ ద్వారా నెల్లూరు కు తరలించారు.  ల్యాబ్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయితే వింజమూర్ లో రెడ్ జోన్ గా మారే పరిస్థితి ఉంది. కనుక ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండీ బయట ప్రాంతాల నుండి వచ్చిన వారి వివరాలు అందజేయాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ, ఆత్మకూరు డి.యల్.పి.ఓ అప్పాజీ, ఇంచార్జ్ ఈ.ఓ.పి.ఆర్.డి బంకా.శ్రీనివాసులురెడ్డి, పంచాయితీ కార్యదర్శి డి.ఖాజా రహంతుల్లా, వి.ఆర్.ఓ ఎస్.కే.రంతుల్లా తదితరులు నల్లగొండ్ల గ్రామంలో పర్యటిస్తూ వివరాలు నమోదు చేసుకుంటున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు