తేదీ: 13-05-2020,
అమరావతి.
*పెట్టుబడులు ఆకర్షించేందుకు అనువైన సమయమిదే : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
మే 22న ఎమ్ఎస్ఎమ్ఈలకు చెల్లింపులు
* తయారీ పరిశ్రమల ఏర్పాటుకు భారతదేశమే గమ్యస్థానం
* ప్రధాని ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో సీఎం జగన్ కోరిన అంశాలనుప్రస్తావించిన మోదీ
* ముఖ్యమంత్రికి ముందుచూపుకు, దార్శనికతకు ఇదే నిదర్శనం
* కేంద్ర ప్రభుత్వం కన్నా, ఇతర రాష్ట్రాల కన్నా ముందే ఎమ్ఎస్ఎమ్ఈల కోసం చర్యలు చేపట్టిన తొలి రాష్ట్రం మనదే
* ఎమ్ఎస్ఎమ్ఈ, వ్యవసాయరంగం, అనుబంధ పరిశ్రమలలకు కేంద్రం సాయం చేస్తుందని ఆశాభావం
* కరోనా నివారణలో ముందున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
* వాస్తవాలను ఎప్పటికప్పుడూ స్పష్టంగా చెబుతూ ప్రజలకు భరోసా ఇచ్చిన సీఎం వైఎస్ జగన్
* కోవిడ్ విజృంభణ నేపథ్యంలో పెట్టుబడులకు ఇతర దేశాల కన్నా భారత్ అనుకూలం
* అందులోనూ అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్ లోనే పెట్టుబడులకు ఎక్కువ అవకాశాలు
* పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం సూచన మేరకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
* పరిశ్రమలు తీసుకురావడానికి ఈడీబీ, టాస్క్ ఫోర్స్ సమన్వయంతో ముందుకెళతాయి
* విధివిధానాల తయారీపై దృష్టి పెట్టాలని మంత్రి మేకపాటి ఆదేశం
* ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం, అనంతర పరిణామాలపైనా మంత్రి చర్చ
* విదేశీ పరిశ్రమలపై చర్యలకు కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని అనుసరించి ముందుకెళుతున్నాం.
* ప్రతిపక్షాల కన్నా ముందే ప్రజాక్షేమం కోసం ఆలోచించే నాయకుడు ముఖ్యమంత్రి
* ప్రభుత్వానికి రెవెన్యూ లోటున్నా, ప్రజలకు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళుతోంది
* విచారణ అనంతరం, దోషులెవరైనా ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోము
* 13 జిల్లాలలో అన్ని పరిశ్రమలనూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం
* క్రమంగా తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు