ఆపన్నహస్తం కోసం అభాగ్యుల ఎదురుచూపు

ఆపన్నహస్తం కోసం అభాగ్యుల ఎదురుచూపు
 ఉదయగిరి లో చిక్కుకున్న పశ్చిమబెంగాల్ వాసులు
 ఉదయగిరి. ప్రాణాంతక కరోనా వైరస్ సోకితే చనిపోవడం మా బతకడమా తర్వాత విషయం కానీ పట్టెడన్నం పెట్టే దిక్కు లేక, భాష రాక, ఎవరిని కలవాలో తెలియక, ఎటు వెళ్లాలో అర్థం కాక ప్రతి క్షణం ఒక యుగంలా పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు వలస కూలీలు పశ్చిమ బెంగాల్ నుంచి పొట్ట చేత పట్టుకొని కరెంటు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ తీగలు సరిచేసే వలస కార్మికులు ఉదయగిరి ప్రాంతానికి వచ్చారు. వారిని తీసుకు వచ్చిన మేస్త్రీలు ఎక్కడి వాళ్ళు అక్కడ వదిలేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు కానీ వారంతా దిక్కుతోచని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు సుమారు 12 మంది పశ్చిమబెంగాల్ వాసులు ఉదయగిరి మండలం గుడి నర్వా గ్రామంలో తలదాచుకుంటున్నారు. అక్కడ పశువుల పాకలో పనిచేసే ఒక కుర్రవాడి దగ్గరికి వీరు అతి కష్టం మీద చేరుకొన్నారు. గత వారం రోజులుగా తిండి లేక నాన్న వాళ్లతో ఫోన్ లో మాట్లాడుకునే సౌకర్యం కూడా లేక నిత్య నరకం అనుభవిస్తున్నారు ఈ వలస కూలీలు. అధికారుల దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే అన్నం పెట్టడం మా డ్యూటీ కాదు అనుమతి మాత్రం తీసుకుని మిమ్మల్ని పంపిస్తాం  అని చెప్పడంతో ఎప్పుడు అనుమతి వస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారు. భాష చేతకాక పోవడంతో అన్నం పెట్టమని అడుక్కునే స్థాయిలో కూడా వాడలేక పోవడం చూపరులను కలిచివేస్తోంది ఉన్నతాధికారులు తక్షణం స్పందించి వారికి అనుమతి ఇచ్చి వారి ప్రాంతానికి చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దాతలు కూడా ఎవరైనా స్పందించి వారికి అంత అన్నం పెట్టి ప్రాణాలు కాపాడాలంటూ వేడుకుంటున్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు