పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ::రమణారెడ్డి

పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ::రమణారెడ్డి .............ఆత్మకూరు  (అంతిమతీర్పు ఇంచార్జ్ రహమత్ ఆలీ .)
ఆత్మకూరు:.  పట్టణంలోని పలు ప్రాంతాలలో  మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐ.వి. రమణారెడ్డి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇటీవల  సుమారు వెయ్యి మందికి నిత్యవసర సరకులు కూరగాయలను అందజేసిన రమణారెడ్డి ఆదివారం మరో 200 మందికి, ఐదు రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మాజీ మండల అధ్యక్షులు బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై . సరుకులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న ఆత్మకూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా సరకులను  అందజేసినట్లు ఐ వి రమణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ  నాయకురాలు పులిమి శైలజ రెడ్డి, నాయకులు దావా పెంచలయ్య, కోడురు రామయ్య, రమణయ్య, ఓంకార్  తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు