జర్నలిస్ట్ లందరకి " 50 లక్షల భీమాను" వర్తింప చేయాలని ఆంద్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ (ఏ.పి.జే.ఎఫ్) mla కి వినతి పత్రం

 


    నాయుడు పేట, మే 8 (అంతిమ తీర్పు) :                 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో.   కోవిడ్ 19 సమయంలో పని చేస్తున్న జర్నలిస్ట్ లందరకి " 50 లక్షల భీమాను" వర్తింప చేయాలని ఆంద్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ (ఏ.పి.జే.ఎఫ్) తరపున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గార్కి తెలియజేస్తూ సూళ్లూరుపేట శాసన సభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్య ద్వారా విన్నతి పత్రంను ఏ.పి.జే. ఎఫ్. నియోజకవర్గ ఇంచార్జి ఓరేపల్లి వెంకటేశ్వర్లు శుక్రవారం ఇవ్వడం జరిగింది. జర్నలిస్ట్ లకు  ప్రభుత్వం కల్పిస్తున్న " హెల్త్ స్కీం" గడువు ముగిసిందని తిరిగి రెన్యూవల్ కోసం అధికారకంగా ఆదేశాలు ఇవ్వాలని శాసన సభ్యులులకు తెలపడం జరిగింది. శాసన సభ్యులు స్పందిస్తూ ఈ రెండు విషయాలను ముఖ్యమంత్రి గార్కి తెలియపరుస్తానని తెలిపారు. ఫోరమ్ సభ్యులు దార రామదాసు, అల్లా భక్ష, ఆనంద్, వెంకటేశ్వర్లు, రమణయ్య,చిన్న రావ్ ఉన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు