అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు అండగా స్వచ్చంధ సంస్థలు ముందుకు రావడం అభినందనీయం: డి.జి.పి


*రాష్ట్రంలోని వైరస్ నివారణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు అండగా స్వచ్చంధ సంస్థలు ముందుకు రావడం అభినందనీయం.
  అమరావతి   మే,6 (అంతిిిమ తీర్ప):     కెరోన మహమ్మారి నుండి నిరంతరం ప్రజలను జాగృతం చేస్తూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిర్వీరామంగా విధులు నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు రాష్ట్రం నలుమూల  నుండి పలు స్వచ్చంధ సంస్థలు, ప్రజాప్రతినిధులు, ఎన్.ఆర్.ఐలు,   పూర్వ విధ్యార్ధి  సంఘల నుండి పెద్దఎత్తున మద్దతు లభిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయం లో పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు మాస్క్ లు, సానిటైజర్ లను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ IPS గారికి అందజేశారు. వారిలో CLA to DGP రమణరాయులు 150 పి‌పి‌ఈ కిట్లు, ఆంధ్ర లయోలా కళాశాల పూర్వ విధ్యార్ది సంఘం 4000 సానిటైజర్ లు, మాజీ పోలీస్ అధికారి  శివానంద్ రెడ్డి 20,000 మాస్క్ లు, యంపి.బలశౌరి 2000 పాకెట్ సానిటిజెర్  లను అందించారు.ఈ సందర్భంగా డి‌జి‌పి మాట్లాడుతూ ఈ విపత్కర సమయంలో  విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంధికి బాసటగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో Add.DG L&O శ్రీ రవిశంకర్ అయ్యనార్, Add DG Welfare శ్రీధర్ రావు, IG, పీ & ఎల్ శ్రీ నాగేంద్ర కుమార్,శ్రీ  మహేష్ చంద్ర లడ్డ ,IPS, OSD వెల్ఫేర్  రామకృష్ణ  పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు