చరిత్రలో ఈ రోజు మే, 6

చరిత్రలో ఈ రోజు
మే, 6


సంఘటనలు
1910: ఇంగ్లాండు చక్రవర్తిగా ఐదవ జార్జి పదవిలోకి వచ్చాడు.
1954: మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు.


జననాలు
1856: రాబర్ట్ పియరీ, ఉత్తర ధ్రువాన్ని చేరిన తొలివ్యక్తి (మ.1920).
1861: మోతీలాల్ నెహ్రూ, భారత జాతీయ నాయకుడు (మ.1931).
1868: రెండో నికోలస్, రష్యా జారు చక్రవర్తి (మ.1918).
1932: మల్లాది వెంకట సత్యనారాయణ రావు, సంగీత విద్వాంసుడు (మ.1996).
1953: టోని బ్లెయిర్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి.
1965: హరిశ్చంద్ర రాయల, రంగస్థల, టి.వి., సినీ నటుడు, రంగస్థల దర్శకుడు, రూపశిల్పి.


మరణాలు 
1910: ఎడ్వర్డ్ VII, ఇంగ్లాండు ఏడవ చక్రవర్తి (జ.1841).
1976: కోకా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తి (జ.1902).
2006: తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, రచయిత, సినిమా నిర్మాత (జ. 1919).
2006: బలివాడ కాంతారావు, తెలుగు నవలా రచయిత (జ.1927).
1971: పింగళి నాగేంద్ర రావు, తెలుగు చలనచిత్ర రచయిత.


పండుగలు , జాతీయ దినాలు 
- ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం.
- అంతర్జాతీయ డైట్ రహిత దినం.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు