జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి

*కోడిమి జర్నలిస్ట్ కాలనీ జులైలో ప్రారంభం..*


*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభానికి కృషి..*


*మాంచో ఫెర్రర్ కు (ప్రోగ్రామ్ డైరెక్టర్ RDT) అభినందనలు*


*జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం*


*నెరవేరనున్న అనంత జర్నలిస్టుల సొంతింటి కల*


*మచ్చా రామలింగా రెడ్డి, I.J.U సభ్యులు, అధ్యక్షుడు జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ పిలుపు.*
*౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼*


🏠రాష్ట్రంలోనే మొట్టమొదట జర్నలిస్ట్ కాలనీ డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంతో.. అనంతపురం నగరంలోని కొడిమి జర్నలిస్ట్ కాలనీ జూలై నెల చివర్లో ప్రారంభం చేయాలని మచ్చా రామలింగారెడ్డి జాతీయ సభ్యులు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) అధ్యక్షులు జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ పిలుపునిచ్చారు.


👉ఈరోజు ఉదయం కోడిమి జర్నలిస్ట్  కాలనీ నందు జిల్లా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మచ్చా రామలింగారెడ్డి పాల్గొని ప్రసంగించారు.


🙏గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేతుల మీదుగా కాలనీలో ఇల్లు ప్రారంభించాలని, RDT మాంచో ఫెర్రర్ సహకారంతో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి అయ్యింది.


🙏స్థానిక శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రిని ఆహ్వానించాలని మచ్చా రామలింగారెడ్డి సూచించారు.


🏠RDT ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో  ఫెర్రర్ ను అభినందిస్తున్నానని కాలనీలో ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చినందుకు ఆర్డిటి సంస్థకు జర్నలిస్టులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని మచ్చా రామలింగారెడ్డి అన్నారు.


✍అనంతరం నగర జర్నలిస్టుల సొంతింటి కల నెరవేరబోతోందని కాలనీలో ఐకమత్యంతో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు, డ్రైనేజీ ఇతర సౌకర్యాలు కల్పించుకోవాలిని సూచించారు. కాలనీ అభివృద్ధి కోసం కమిటీని ఏర్పాటు చేశారు, కమిటీ కన్వీనర్ గా సాక్షి నగేష్ ని మచ్చా రామలింగారెడ్డి నియమించారు.


👉ఈ సమావేశంలో లో సొసైటీ కార్యదర్శి విజయరాజు, సాక్షి నగేష్, సతీష్, రాము, రంగనాథ్, ఈనాడు రవి కిరణ్, హిందూ ప్రసాద్ ఫోటోగ్రాఫర్, సొసైటీ సభ్యులు దామోదర్ రెడ్డి, మంజునాథ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ ప్రసాద్, ఆది, సూర్యప్రకాష్ రెడ్డి కమిటీ సభ్యులు మల్లికార్జున, ప్రకాష్, రమణ, నాయక్, దిలీప్ హనుమంత్ రెడ్డి, బాలు, జూని, షాకీర్ నాగేంద్ర, ఉపేంద్ర, జీవన్ తదితరులు పాల్గొన్నారు.


💎DIST... JOURNALIST DEVELOPMENT SOCIETY, ANANTAPURAMU💎


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు