ఇప్పటి వరకు 80 మందికి పరీక్షలు నిర్వహించిన 11 మందికి పాజిటివ్ లక్షణాలు :చిత్తూరు కలెక్టర్

చిత్తూరు. ,మే 9. చిత్తూరు జిల్లాలో చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కు పలుమార్లు వెళ్లి వచ్చిన లారీ డ్రైవర్లు క్లీనర్లు మరియు మండలాలకు సంబంధించిన సిబ్బంది కి పరీక్షలు నిర్వహించామని ఇందులో ఇప్పటివరకు పదకొండు పాజిటివ్ కేసులు వివిధ ప్రాంతాల్లో నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా అన్నారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల చెన్నై కోయంబేడు మార్కెట్ కాంట్రాక్టులకు సంబంధించి వివరాలు సేకరించడం జరిగింది అని ఇందులో 160 మంది కి ప్రైమ్ కాంటాక్ట్ లో ఉన్నట్లు తెలిసిందని ఇప్పటి వరకు 80 మందికి పరీక్షలు నిర్వహించిన 11 మందికి పాజిటివ్ లక్షణాలు వచ్చాయి మరో 80 మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉందని అదేవిధంగా వీరికి సంబంధించిన కాంట్రాక్టులు గా మరో వెయ్యి మందికి రెండు రోజుల్లో పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా అన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు