చిట్టేడిమిట్ట వాసులకు టి.డి.పి నేత 'గూడా ' బియ్యం పంపిణీ

*చిట్టేడిమిట్ట వాసులకు టి.డి.పి నేత 'గూడా ' బియ్యం పంపిణీ


* వింజమూరు, మే 10 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలోని చిట్టేడిమిట్టలో ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గూడా.నరసారెడ్డి, ఆయన కుమారులు గూడా.నరేంద్రరెడ్డి, నవీన్ రెడ్డిలు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గూడా.నరసారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రస్తుత తరుణంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ క్రమంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను ఆదుకునేందుకు వింజమూరు మండలంలో దాతలు విరివిగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మనసున్న మారాజులుగా వింజమూరు కీర్తి ప్రతిష్టలను జిల్లా నలుమూలలా వ్యాపింపజేయడం అభినందనీయమన్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో కరోనా వైరస్ ముప్పు నుండి ఊపశమనం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా.చంద్రబాబు నాయుడు  ప్రజలకు ఇస్తున్న సందేశాలు చరిత్రలో సువర్ణాక్షరాలలో లిఖించబడిన అమూల్యమైన సందేశాలన్నారు. ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని.వెంకటరామారావు పిలుపు మేరకు పేదలకు తన వంతు సాయం అందించేందుకు గానూ చిట్టేడిమిట్టలో పలువురు పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం ఆయన యర్రబల్లిపాళెంలోని తన స్వగృహంలో మీడియా మిత్రులతో కలిసి సహపంక్తి భోజనాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో వింజమూరు మండల టి.డి.పి మాజీ కన్వీనర్ యన్నం.రామచంద్రారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు గొంగటి.రఘునాధరెడ్డి, బి.సి సెల్ నేత బద్దిక.సుబ్బరాయుడు, ఎస్.సి సెల్ నేత కావేటి.ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు