మృతుడి ఫార్చ్యూనర్ వాహనం స్వాధీనం

మృతుడి ఫార్చ్యూనర్ వాహనం స్వాధీనం


వింజమూరు, మే 6 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): వింజమూరు మండలం చౌటపల్లి గ్రామంలో ఇటీవల దారుణ హత్యకు గురైన మేడిపల్లి.వెంగళరావుకు చెందిన ఫార్చ్యూనర్ వాహనాన్ని ఎట్టకేలకు పోలీసులు స్వాధీనం చేసుకుని వింజమూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ కావలి డి.యస్.పి ప్రసాద్, కలిగిరి సి.ఐ రవికిరణ్ ఆదేశాల మేరకు ముమ్మరంగా దర్యాప్తు నిర్వహించి దుత్తలూరు మండలంలోని బండక్రిందపల్లి అటవీ ప్రాంతంలో నిందితులు వదిలేసి వెళ్ళిన వాహనాన్ని గుర్తించడం జరిగిందన్నారు. వెంగళరావు అదృశ్యమయ్యాడని అతని సమీప బంధువు అందించిన సమాచారంతో 24 గంటల వ్యవధిలోనే కేసును చేధించడంలో భాగంగా వెంగళరావు మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని కనుగొని మృతదేహమును వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించామన్నారు. మృతుడు వెంగళరావు తిరిగే ఫార్చ్యూనర్ వాహనాన్ని కనిపెట్టడంతో పాటు హత్యలో పాల్గొన్న మిగతా నిందితుల ఆచూకీ కోసం ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తున్నామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఈ సంధర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి తెలియజేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు