దారి దోపిడీ, బైక్ కాల్చివేత పై కేసు నమోదు

*దారి దోపిడీ, బైక్ కాల్చివేత పై కేసు నమోదు
వరికుంటపాడు ,మే 9 (అంతిమ తీర్పు) : వరికుంటపాడు మండలం విరువూరు సమీపంలో దారి దోపిడీ, మోటార్ సైకిల్ దహనం జరిగింది.పోలీసులు తెలిపిన  వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా పామూరు కి చెందిన పబ్బతి వెంకటనారాయణ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి  నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పాపానగారిపల్లి కి వెళ్లి వ్యక్తిగత పనులు ముగించుకుని తిరిగి పామూరు కి వెళ్తుండగా విరువూరు శివారు ప్రాంతం లో అతని బుల్లెట్ వాహనాన్ని ఆపి పొదల్లోకి తీసుకెళ్లి కళ్ళలో కారం కొట్టి అతని వద్ద ఉన్న 4000 రూపాయలు, సెల్ ఫోన్ ని తీసుకుని పారిపోయారు. ఈ విషయం అయి బాధితుడు వరికుంటపాడు పోలీస్ లకు పిర్యాదు చేయడం జరిగింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎసై ఉమా శంకర్ జరిగిన ఘటన పై కేసు నమోదు చేసి అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు