లాగ్ డౌన్ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఓఆర్ఎస్ మజ్జిగ పంపిణీ

లాగ్ డౌన్ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఓఆర్ఎస్ మజ్జిగ పంపిణీ .........


ఏఎస్ పేట,మే 17 :


(అంతిమ తీర్పు రహమత్ అలి )..............కరోనా వైరస్ ను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాగ్ డౌన్  విధించడంతో ప్రజల ప్రాణాల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖల సిబ్బందికి మండల కేంద్రమైన ఏఎస్ పేటలోని దర్గా ఎదురుగా గల రోడ్డులో ఉన్న హబీబ్ క్లినిక్& మెడికల్ నిర్వాహకులు డాక్టర్ షేక్. ఖాజామియా  డాక్టర్ షేక్. సిరాజ్ ల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఓఆర్ఎస్ మజ్జిగ ఇతర ఎనర్జీ పానియాలను అందిస్తున్నారు అందులో భాగంగా ఆదివారం విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్లు వైద్య సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఖాజామీయా మాట్లాడుతూ లాక్డౌన్ మొదలైనప్పటి నుండి గత 55 రోజులుగా తమ వంతుగా తమ కోసం కష్టపడుతున్నా పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, పోలీసులు, వాలెంటీర్లకు లకు ఎనర్జీ పానీయలైన ఓఆర్ఎస్, బాదం మిల్క్, మజ్జిగ, లస్సీ, లాంటివి తమ వంతుగా పంపిణీ చేస్తున్నట్లు డాక్టర్ ఖాజామియా తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సిరాజ్ తోపాటు అదీ క్లినిక్ సిబ్బంది పాల్గొన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు