కోయంబేడు నుంచి వచ్చే వ్యాపారుల సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కు తెలపాలి. ;కడపజిల్లా కలెక్టర్ CH హరి కిరణ్

కడప, మే 10 (అంతిమ తీర్పు) :


తమిళనాడు రాష్ట్రం కోయంబేడు నుంచి వచ్చే వ్యాపారుల సమాచారాన్ని కంట్రోల్ రూమ్ కు తెలపాలని కడపజిల్లా కలెక్టర్ CH హరి కిరణ్ ఒక ప్రకటన లో తెలిపారు.
తమిళనాడు రాష్ట్రం కోయంబేడు నుండి లారి లలో పండ్లు కూరగాయలు తీసుకొని కడపజిల్లా వచ్చిన హోల్ సేల్ వ్యాపారులు, రిటైలర్లు పండ్లు ,కూరగాయలు లారీలలో నింపడం మరియు దించడం చేసే హమాలి కూలీలు ఎవరైనా వస్తే వెంటనే జిల్లాలో ని కోవిడ్ కంట్రోల్ రూమ్ నెంబర్ ,08562 245259, 259179 నెంబర్లు కు ఫొన్ చేసి సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ CH  హరి కిరణ్ తెలిపారు.అలాంటి వారిని జిల్లా కోవిడ్ ఆసుపత్రి ఫాతిమా మెడికల్ కాలేజ్ కి గాని లేదా జిల్లా ఆసుపత్రి ప్రొద్దుటూరు కు వచ్చి కోవిడ్ పరీక్షలు తప్పనిసరి గా చేయించుకోవాలన్నారు. లేదా వారికి అందుబాటులో గాని  దగ్గరలో ఉన్న మెడికల్ ఆఫీసర్ ను గాని సంప్రదించాలన్నారు. వ్యాపార నిమిత్తం వచ్చేవారికి పక్క జిల్లాలో కేసులు నమోదు అవుతున్నాయన్నారు.దీని దృష్ట్యా కోయంబేడు నుంచి కడప కు,కడప నుండి కోయంబేడు కు వ్యాపారం కోసం  వెళ్లి వచ్చే హోల్ సేల్, రిటైల్,హమాళిలు అందరూ తప్పనిసరిగా ఈ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ CH  హరి కిరణ్ ఒక ప్రకటన లో తెలిపారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు