నిజాలను నిర్భయంగా రాసే 'పత్రికా స్వేచ్ఛ' అవశ్యం : మంత్రి గౌతమ్ రెడ్డి

 


తేదీ: 03-05-2020,
అమరావతి.


పత్రికా స్వేచ్ఛ ప్రతి ఒక్కరి స్వేచ్ఛ: మంత్రి గౌతమ్ రెడ్డి


* నిజాలను నిర్భయంగా రాసే 'పత్రికా స్వేచ్ఛ' అవశ్యం


అమరావతి, మే, 03;  నిత్య ప్రజా చైతన్యానికి, సమాజాన్ని సంఘటితం చేయడానికి పాటు పడే పత్రికలకు స్వేచ్ఛ అవశ్యమని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి,  ప్రపంచానికి తెలియని వాస్తవాలు వెలికి తీసి ప్రజల ముందుంచడానికి, , విపత్కర పరిస్థితుల్లో జనాన్ని మేల్కొలపడానికి, అత్యవసర సమయాల్లో అందరినీ ఒకతాటిపై నిలిపేందుకు పత్రికా స్వేచ్ఛ అత్యంత అవసరమని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో ప్రభుత్వం చేపడుతోన్న చర్యలను ప్రజలకు తెలుపుతున్న పత్రికలకు, విలేకరులకు మంత్రి కృతజ్ఞతాభినందనలు తెలిపారు. ఎటువంటి సమస్య వచ్చినా దాని పరిష్కారం కోసం, ప్రజల కష్టాలను తీర్చడం కోసం తపించే పత్రికా స్వేచ్ఛ ఎప్పుడూ వెలకట్టలేనిదని మంత్రి తెలిపారు. ముఖ్యంగా, కరోనా సమయంలో అవాస్తవాలతో భయాందోళన చెందే ప్రజలకు నిజాలను నిర్భయంగా పత్రికలే గుండె ధైర్యమని మంత్రి వెల్లడించారు. ఇతర మాధ్యమాలకు పత్రికలు ఆదర్శమని అన్నారు. పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడి త్యాగాలు చేసిన కలం యోధులను స్మరించుకోవడానికి  యునెస్కో  తీర్మానం మేరకు 1993 నుంచి ప్రతి ఏటా మే 3న జరుపుకునే పత్రికా స్వేచ్ఛ   ప్రపంచంలోని ప్రతి ఒక్కరి స్వేచ్ఛ అని మంత్రి మేకపాటి పేర్కొన్నారు.


 


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు