కష్ట కాలంలో ముఖ్యమంత్రి కొత్త పథకం " జగనన్న  గొంతుతడి"- షేక్ బాజి.


(విజయవాడ)


 *కష్ట కాలంలో ముఖ్యమంత్రి కొత్త పథకం " జగనన్న  గొంతుతడి"- షేక్ బాజి.*


మద్యం షాపులు తెరిచి మరో " జగనన్న గొంతు తడి" పథకానికి తెర లేపి తడిగుడ్డతో గొంతు కోసారని ,గత 45 రోజులుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ను సమూలంగాఅంతంమొందించేందుకు ప్రతినపునినా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి అదేశాలను సైతం జగన్మోహన్ రెడ్డి పెడచెవిన పేడుతున్నారని ఈరోజు నుండి కేంద్రం రెండు వారాలు లాక్డౌన్ పొడిగిస్తూ సూచనలు జరిచేస్తే పట్టించుకోకుండా అన్ని  వివిధ జోన్లును ఏర్పాటు  చేస్తే అన్నింటిని ఒక్కటి చేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తూన్నారని భాజపా జాతీయ మైనార్టీ మోర్చా కార్యదర్శి షేక్ బాజి ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బ్రాందీ షాప్ లు ప్రారంభానికి అనుమతి ఇచ్చి రాత్రికి రాత్రే అమాంతంగా రేట్లు పెంచి పేదవాళ్ళ పొట్టగొడుతున్నారని మద్యపాన నిషేదం అంటే అడ్డగోలు రేట్లు పెంచటం కాదని అంచెలంచెలుగా దుకాణాలు తగ్గిస్తే సరిపోతుంది అని సూచించారు. మీ ప్రభుత్వం తీసుకున్న తీరువల్ల ఈరోజు రోడ్లపైకి గుంపులు గుంపులుగా వచ్చి చేరారని వారిని పోలీస్ యంత్రాంగం ఎంతవరకు అదుపు చేయగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు