నిబంధనల ఉల్లంఘనకు జరిమానాలు విధించిన ఇ.ఓ*

*నిబంధనల ఉల్లంఘనకు జరిమానాలు విధించిన ఇ.ఓ* వింజమూరు, మే 17, (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులో ఆదివారం నాడు ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ మాంసం విక్రయాలు జరుపుతున్న నలుగురు వ్యక్తులకు పంచాయితీ సెక్రటరీ బంకా.శ్రీనివాసులు రెడ్డి 5 వేల రూపాయలను జరిమానాలుగా విధించారు. ప్రస్తుత కరోనా వైరస్ నియంత్రణా చర్యలలో భాగంగా గత నెల రోజుల వ్యవధిలో ఆదివారం దినములలో చికెన్, మటన్, చేపల విక్రయాలు జరపరాదని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్న విషయాలు అందరికీ తెలిసిందే. ఆదివారం సమయాలలో ఈ దుకాణాల వద్ద రద్దీ అధికంగా ఉంటుందని, ఈ పరిణామాలు కరోనా వైరస్ వ్యాప్తికి కారణభూతాలవుతాయనే ఉద్దేశ్యంతో క్షేత్ర స్థాయి అధికారులు తగు చర్యలు దిశగా అడుగులు వేస్తున్నారు. వింజమూరులోని బంగ్లాసెంటర్, షఫి హాస్పిటల్ వీధి, దేవతా మహల్ సెంటర్, గంగమిట్ట తదితర ప్రాంతాలలో మాంసం విక్రయాలు భారీగా జరుగుతుంటాయి. ప్రజలు సమదూరం పాటిస్తేనే కరోనా వైరస్ కట్టడి సాధ్యమని భావించిన అధికారులు ఆదివారాలలో మాంసం దుకాణాల వద్ద ఏర్పడే రద్దీని నియంత్రించేందుకు ఈ అమ్మకాలపై నిషేదం విధించారు. కానీ కొంతమంది వ్యాపారులు రహస్య ప్రదేశాలలో మాంసం విక్రయాలకు నడుం బిగించారు. వీటిపై నిఘా ఉంచిన పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి ఆదివారం నాడు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తమ సిబ్బందితో పలు ప్రాంతాలలో సోదాలు చేసి నలుగురు మాంసం విక్రయదారులకు 5 వేల రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు అందరూ కంకణ బద్ధులై ఉండాల్సిన అవసరం ప్రస్తుత తరుణంలో ఎంతైనా ఉందన్నారు. లాక్ డౌన్ నిబంధనల అంశాల విషయంలో ప్రభుత్వ శాఖల అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు