ముఖ్యమైన పని నిమిత్తం మాత్రమే ప్రజలు, పౌరులు E-PASS (ఈ-పాస్‌)ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం : డి.జి.పి

 తేది :13.05.2020
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ 
ఆంధ్ర ప్రదేశ్ 
రాష్ట్ర ప్రజల క్రియాశీల సహకారంతో ప్రభుత్వం వైరస్ నియంత్రణకు నిరంతరం చర్యలు తీసుకుంటోంది.  ఈ ప్రక్రియలో భాగంగా, రాష్ట్ర సరిహద్దులు పూర్తిగా మూసివేయబడ్డాయి. అయినప్పటికీ, కిరాణా, ఇతర నిత్యావసర వస్తువులు పౌరులకు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈ పరిస్థితిలో కొంతమంది ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ తో ప్రయాణించేవారు, కుటుంబంలో మరణం, సామాజిక పనుల కోసం,  ప్రభుత్వ విధి నిర్వహణలో లేదా ఇతర  అత్యవసరమైన వాటి కోసం ప్రయాణించడానికి ఇక్కట్లు పడుతునట్లు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి, ప్రయాణానికి అవసరమైన వారికి పాస్ ఇవ్వమని పోలీసు శాఖను ఆదేశించారు. ముఖ్యమైన పని నిమిత్తం మాత్రమే ప్రజలు, పౌరులు E-PASS (ఈ-పాస్‌)ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
 అత్యవసర పాస్‌ల కోసం అభ్యర్థించే వారు ఈ క్రింది సమాచారాన్ని అందించాలి:
1. ఫోటోతో పాటు పూర్తి పేరు, మొబైల్ నంబర్
2.  మెడికల్ సర్టిఫికెట్లు, అధికారిక లేఖలు మొదలైనవి అప్‌లోడ్.
3. ఆధార్‌ను అప్‌లోడ్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు 
4. పూర్తి ప్రయాణ వివరాలు. 
5. ప్రయాణించే వాహన పూర్తి వివరాలు, ప్రయాణీకుల సంఖ్య. కారుకు (1+3) అనుమతి.  
 Https: citizen.appolice.gov.in వెబ్‌సైట్‌లో పైన పేర్కొన్న అన్ని వివరాలతో పౌరులు/ ప్రజలు కోవిడ్ 19 అత్యవసర వాహన e-pass కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆమోదించబడితే వాహన అత్యవసర e-pass ను దరఖాస్తు చేసుకున్నా వారి మొబైల్ నెం లేదా మీరు దరఖాస్తు చేసిన మెయిల్ ఐడికి పంపబడతాయి. వెబ్‌సైట్ నుండి జారీ చేసిన అత్యవసర పాస్‌లు మాత్రమే అంగీకరించబడతాయి.  అత్యవసర వాహన పాస్‌తో పాటు, పౌరులు ప్రయాణించేటప్పుడు వారి ఒరిజినల్ ఐడి కార్డును కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలి. సమర్పించిన వివరాల ధృవీకరణ తరువాత, వీలైనంత త్వరగా ఈ-పాస్ జారీచేస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై తగిన చర్యలు తీసుకుంటారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు