టెలిమెడిషన్ విధానంలో మందులు పంపిణీ చేయాలి ; ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని 

జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు... 
* ఆరోగ్యసేతు యాప్ వినియోగంపై ప్రజలను చైతన్యవంతం చేయాలి
* టెలిమెడిషన్ విధానంలో మందులు పంపిణీ చేయాలి
* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని
అమరావతి: వైరస్‌పై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వారికి అవసరమైన సమాచారాన్ని అందించేందుకు వీలుగా జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శుక్రవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ నీలం సాహ్ని మాట్లాడుతూ కరోనా వైరస్ పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా ఎప్పటి కప్పుడు సందేశాలను ఇచ్చేందుకు వీలుగా జిఓ.సంఖ్య 257 ద్వారా ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతోందన్నారు. ఆరోగ్య సేతు యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునేలా ప్రజలను చైతన్యం చేయాలని దీనిపై ఇప్పటికే జి.ఓ.సంఖ్య. 254 ద్వారా ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు.కావున ప్రతీ ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని వినియోగించేలా చూడాలన్నారు. కరోనా వైరస్ నేపధ్యంలో  టెలీమెడిషన్ విధానం పటిష్టంగా అమలయ్యేలా చూడాలని సిఎస్ స్పష్టం చేశారు.అంతేగాక టెలిమెడిషన్ విధానంలో డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన 24 గంటల్లోగా సంబంధితులకు మందులు అందేలా చూడాలన్నారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో వైయస్సార్ క్లినిక్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రీన్ జోన్లలో వివిధ ఎంఎస్ఎంఇ యూనిట్లన్నీ ప్రారంభించి భౌతిక దూరాన్ని పాటించిస్తూ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఈఎంఎస్ఎంఇలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ప్రకటించిందని అనగా 2014-15 సంవత్సరాలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను క్లియర్ చేయడం జరుగు తుందని సిఎస్ పేర్కొన్నారు. అంతేగాక ఏప్రిల్ నుండి జూన్ వరకూ విద్యుత్ చార్జీల రద్దు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని అలాగే వర్కింగ్ క్యాపిటల్ ను కూడా ఇవ్వడం జరుగుతుందని సిఎస్ తెలిపారు.3వ దశ లాక్ డౌన్ సమీపిస్తున్న నేపథ్యంలో కంటైన్మెంట్ ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా లాక్ డౌన్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని సిఎస్ స్పష్టం చేశారు. వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న టెస్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. టెలి మెడిసిన్ విధానంలో డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన 24 గంటల్లోగా సంబంధిత పిహెచ్ సిరి ద్వారా మందులు పంపిణీ జరిగేలా చూడాలని అన్నారు. వీడియో సమావేశంలో కొవిడ్ కంట్రోల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, సిఆర్డిఏ అదనపు కమీషనర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు