గూడూరు లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలొ రక్తదానం

గూడూరు మే 13 (అంతిమ తీర్పు) :


జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలొ రక్తదానం.......జనవిజ్ఞాన వేదిక గూడూరు వారి ఆద్వర్యంలొ గవర్నమెంట్ హాస్పిటల్ గూడూరు నందు 20మందికి పైగా జె.వి.వి. సభ్యులు రక్తదానం చేయడం జరిగింది. డాక్టర్ సుబ్రహ్మణ్యం  మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ నందు బ్లడ్ తక్కువగ ఉన్నందున జె.వి.వి. వారిని మా అసుపత్రి నందు రక్తము ఇవ్వమని కోరడమైనది. కరోన లాంటి విపత్కర పరిస్తితుల్లొకూడా జె.వి.వి. వారు వెంటనే స్పందించి 20 మందికి పైగా రక్తదానము చేసినందుకు వారికి రెండుచేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను..మా ఆసుపత్రికి జె.వి.వి. వారు అన్నివిదాలుగ సహకరిస్తున్నందుకు చాలా సంతోషంగ ఉందని తెలిపారు...రక్తము నిల్వలను ఆన్ లైన్లో ఉంచుతున్నామని ఎవరైనా చూసుకోవచ్చని అపోహాలు వద్దని తెలిపారు. పేదలు ఎవరికైనా రక్తము అవసరమైతే మమ్మల్ని సంప్రదించమని కోరారు...ఈ కార్యక్రమంలొ జె.వి.వి. అధ్యక్షులు వేగూరు రాజేంద్రప్రసాద్, అశోక్, మనోహర్, శ్రీనివాస్,రాజశేఖర్ రెడ్డి, రూప్ కుమార్, మధు, సాయి, కిరణ్, ఇమ్రాన్, విశాల్, అఖిల్, ప్రదీప్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు