కార్యకర్తను పరామర్శించిన ' కావ్యా. క్రిష్ణారెడ్డి '*

*కార్యకర్తను పరామర్శించిన ' కావ్యా. క్రిష్ణారెడ్డి '*


జలదంకి, మే 7 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): తన అనుయాయుడిగా ఉన్న కార్యకర్త అనారోగ్యంతో భాధపడుతున్నాడని తెలుసుకున్న ఆ నేత ఆఘమేఘాల మీద ఆ కార్యకర్త ఇంటికి చేరుకుని నీకు నేనున్నానంటూ మనోధైర్యం నింపి కార్యకర్తలకు భరోసా ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. వివరాలలోకి వెళితే జలదంకి మాజీ మండలాధ్యక్షులు, కావ్యా చారిటబుల్ ట్రస్ట్ అధినేత దగుమాటి.వెంకటక్రిష్ణారెడ్డి గురువారం సాయంత్రం జలదంకి పంచాయితీ పరిధిలోని అరుందతీయవాడకు వెళ్ళి అనారోగ్యంతో భాధపడుతున్న మల్లెల.శ్యామేల్ అనే కార్యకర్తను పరామర్శించారు. భాధితుడికి ధైర్యం చెప్పడంతో పాటు అతని తల్లిదండ్రులతో మాట్లాడుతూ అధైర్య పడాల్సిన అవసరం లేదని మీ కుటుంబానికి నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. విలక్షణ శైలి కలిగిన కావ్యా. క్రిష్ణారెడ్డి ఒక్కసారిగా అరుందతీయవాడకు వచ్చి ఒక సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్ళి అతని వద్దనే కూర్చుని మాటామంతీ కలపడంతో కాలనీ వాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వ్యాపారరీత్యా ఇతర ప్రాంతాలలో బిజీ బిజీగా ఉంటున్నప్పటికీ తన వెన్నంటి నిలిచిన కార్యకర్తలను ఎట్టి పరిస్థితులలోనూ వుస్మరించేది లేదని స్పష్టం చేశారు. ఈ సంధర్భంగా ఆయన వెంట నేతలు కూరపాటి.మాలకొండారెడ్డి, ఇస్కా.మదన్ మోహన్ రెడ్డి, సురె.శేషారెడ్డి, కోర్సిపాటి.రామిరెడ్డి తదితరులున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు