బలోపేతానికి చారిత్రక ప్రణాళిక రూపొందించిన ఏపీ ప్రభుత్వం

15–05–2020
అమరావతి


ప్రజారోగ్య రంగంలో సమూల మార్పులు
బలోపేతానికి చారిత్రక ప్రణాళిక రూపొందించిన ఏపీ ప్రభుత్వం
ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలపై రూ16,203 కోట్లకు పైగా ఖర్చు
కొన్నింటిలో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్తగా మరి కొన్ని నిర్మాణం
వచ్చే ఏడాది మార్చిలోగా వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌లు (సబ్‌సెంటరు)్ల నిర్మాణం, పీహెచ్‌సీల్లో నాడు–నేడు, కొత్త వాటి నిర్మాణం పూర్తి
కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో నాడు–నేడు, కొత్త వాటి నిర్మాణం వచ్చే ఏడాది సెప్టెంబరుకు పూర్తి
సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశాలు
కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాల నమూనాల పరిశీలన


అమరావతి: 
రాష్ట్రంలో ఆరోగ్య రంగం పూర్తిస్థాయిలో బలోపేతం కానుంది. సబ్‌ సెంటర్ల నుంచి మెడికల్‌ కాలేజీల వరకూ నాడు –నేడు కార్యక్రమాలు, కొత్తవాటి నిర్మాణం కోసం ఏకంగా రూ.16,200 కోట్లు ఖర్చు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించుకుంది. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంపు కార్యాలయంలో దీనికి సంబంధించి అధికారులతో సమీక్ష చేశారు. డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌లు (సబ్‌ సెంటరు)్ల:
– ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక విలేజ్‌ క్లినిక్‌ ఉండాలని ప్రభుత్వం ఇది వరకే నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ లాంటి విపత్తులను ఎదుర్కోవాలంటే గ్రామ స్థాయి నుంచి కూడా సబ్‌ సెంటర్ల రూపంలో 24 గంటల పాటు సేవలందించే వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగానే దాదాపు 10 వేల వైయస్సార్‌ క్లినిక్స్‌ల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. వీటి కోసం దాదాపు రూ.2026 కోట్లు ఖర్చు చేయనుంది. ఇవి కాకుండా ఇప్పటికే 1086 సబ్‌ సెంటర్లలో నాడు–నేడు ద్వారా అవసరమైన సదుపాయాలను కల్పిస్తుంది. 


– సబ్‌ సెంటర్ల నిర్మాణం కోసం ఇప్పటి వరకూ 4 వేల స్థలాలను గుర్తించారు, మరో 6 వేల సబ్‌సెంటర్లకు స్థలాలను గుర్తించాల్సి ఉంది. జూన్‌ 15లోగా స్థలాల గుర్తింపు కావాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. 
వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా సబ్‌ సెంటర్ల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. 


ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు:


– రాష్ట్రవ్యాప్తంగా 1,138 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో 149 కొత్త పీహెచ్‌సీల నిర్మాణం కోసం రూ. 256.99  కోట్లు ఖర్చు చేయనున్నారు.
– మరో 989 పీహెచ్‌సీల్లో అభివృద్ధి పనులకోసం రూ. 413.01 కోట్లు ఖర్చుచేయనున్నారు. మొత్తంగా రూ. 671 కోట్లు ఖర్చు చేయనున్నారు.


ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రులు:


– 52 ఏరియా ఆస్పత్రుల్లో నాడు నేడు కింద రూ.695 కోట్ల ఖర్చు చేయనున్నారు. 
– 169 కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో రూ.541 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా రూ.1,236 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 


కొత్త మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు:


– రాష్ట్రంలో పాత మెడికల్‌ కాలేజీలు 11 ఉన్నాయి. 
– వీటితోపాటు అటాచ్డ్‌ ఇనిస్ట్యూషన్స్‌ టు మెడికల్‌కాలేజీలు –6, గిరిజన ప్రాంతాల్లో 7 సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు కొత్తగా రానున్నాయి. 
– వీటన్నింటికోసం రూ.6100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
– ఇవికాక 15 కొత్త మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు, కడపలో 3 వైద్య సంస్థలు....సూపర్‌ స్పెషాల్టీ, క్యాన్సర్, ఇన్సిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ కాలేజీ కోసం మొత్తంగా రూ. 6,170 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా.
– ప్రతి మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.
– కొత్తగా నిర్మించదలచిన మెడికల్‌ కాలేజీల నిర్మాణ రీతులపై నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. 
– నాడు – నేడు కార్యక్రమాల్లో నాణ్యతలో రాజీ పడొద్దని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణాలు పటిష్టంగా, నాణ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 
– మొత్తం ప్రజారోగ్య రంగంలో నాడు –నేడు, కొత్తవాటి నిర్మాణాలకోసం రూ.16,200 కోట్లకుపైనే ఖర్చు అవుతుందని అంచనా.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
*పేకాట స్థావరంపై పోలీసుల దాడులు* నలుగురు అరెస్ట్..... ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నందిపాడు అటవీ ప్రాంతంలో జరుగుతున్న పేకాట స్థావరంపై ముందస్తుగా అందిన సమాచారం మేరకు దుత్తలూరు ఎస్.ఐ జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నందిపాడుకు చెందిన ముగ్గురు, ఉదయగిరికి చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 13 వేల రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు , 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ మాట్లాడుతూ దుత్తలూరు పరిసరాలలో అటవీ ప్రాంతాలను ఆసరాగా చేసుకుని కొంతమంది పేకాట నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని ఎస్.ఐ తేల్చి చెప్పారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. పేకాట, కోడి పందేలు, అకమంగా మద్యం తరలింపు, గ్రామాలలో బెల్టుషాపుల ముసుగులో మద్యం అమ్మకాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ప్రజలు డేగ కన్ను వేసి శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల ఏరివేత దిశగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలు ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్.ఐ జంపాని కుమార్ ప్రజలకు తెలియజేశారు.
Image
కరోనా పై గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రోజువారీ నివేదిక, తేది: 11.04.2020