గర్భిణీ స్త్రీలకు  పిల్లలకు పౌష్టికాహారం తోనే ఆరోగ్యం

గర్భిణీ స్త్రీలకు  పిల్లలకు పౌష్టికాహారం తోనే ఆరోగ్యం
ఆదోని,మే, 11 (అంతిమతీర్పు):-ఆదోని పట్టణంలో గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం వల్లనే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, యూనియన్, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ సూచించారు. సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం  స్త్రీల చిన్న పిల్లల ఆసుపత్రి లో మాతృ మూర్తులకు గర్భిణీ మహిళలకు మాస్క్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోణ మహమ్మారి నియంత్రణకు మాస్కూలను తప్పనిసరిగా ధరించాలి అన్నారు. ఆరోగ్య కేంద్రాలలో గర్భిణి స్త్రీలు ప్రతి నెల పరీక్షలు నిర్వహించుకోవాలని ఆరోగ్యంగా ఉండాలన్నారు. గర్భిణీలకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో అందించే పౌష్టికాహారం తీసుకొని ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకురాలు లలిత, చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు