పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

*08–05–2020*
*అమరావతి*


*పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష


*అమరావతి:*


*పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష:*
*మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది సహా పలువురు అధికారులు హాజరు.*


*ఉపాధి హామీ పనులు*


కరోనా కారణంగా ఉపాధి హామీ పనులు మందగించాయన్న అధికారులు
భౌతిక దూరం పాటిస్తూ పనులు మొదలుపెట్టామని, ఇప్పుడిప్పుడే పనులు వేగం అందుకున్నాయన్న అధికారులు
వర్షాలు వచ్చే లోపు వీలైనన్ని పని దినాలు కల్పించాలన్న సీఎం
ఉపాధి హామీ పథకంలో కూలీలకు వీలైనన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలన్న సీఎం


*గ్రామాల్లో అభివృద్ధి*


గ్రామాల్లో చేపట్టిన గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రగతిని వివరించిన సీఎం.
గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు అత్యంత ప్రాధాన్యమైనవి: సీఎం
వీటి నిర్మాణాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది: సీఎం


16,208  వార్డు, గ్రామ సచివాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదించిన అధికారులు.
పరీక్షలకు అనుమతులు రాగానే భర్తీ చేస్తామని వెల్లడి.
*పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు జూలై 31 కల్లా పూర్తి చేస్తామని వెల్లడి*
గ్రామ సచివాలయాల నిర్మాణం ఆగస్టు 31 కల్లా  పూర్తి చేయడానికి యత్నిస్తున్నామన్న అధికారులు
మార్చి 31, 2021 కల్లా రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేస్తామన్న అధికారులు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు