సొంత ప్రదేశాలకు బయలుదేరిన చత్తీస్ గడ్ భక్తులు

సొంత ప్రదేశాలకు బయలుదేరిన చత్తీస్ గడ్ భక్తులు .....            ఏ.ఎస్.పేట, మే 13 (అంతిమ తీర్పు) :        .మండల కేంద్రం యాత్రా స్థలమైన ఏఎస్ పేట  దర్గా దర్శనానికి వచ్చి లాక్ డౌన్ కారణంగా గత 50 రోజుల నుండి ఇక్కడే చిక్కుకున్న చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన భక్తులను ఎట్టకేలకు అధికారులు వారి సొంత రాష్ట్రానికి పంపించే ఏర్పాట్లు చేశారు అందులో భాగంగా ఎఎస్ పేట నుండి గుంటూరు వరకు 34 మంది చత్తీస్గఢ్ వాసులను ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి గుంటూరు నుండి ట్రైన్లో వారి స్వర ప్రదేశాలకు వెళ్లే ఏర్పాట్లను అధికారులు చేశారు ఏది ఏమైనా తమ సొంత ప్రదేశాలకు వెళ్తున్నామన్న ఆనందం వ్యక్తం చేసిన భక్తులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ ఏవో ఎంపీడీవో కార్యాలయ ఏవో శ్రీనివాసులు ఎస్ఐ గోపాల్ ఎంపీడీఓ కార్యాలయ జూనియర్ సహాయకులు సులేమాన్ తదితరులు పాల్గొన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు