పేద ప్రజల ఆకలి తీరుస్తున్న రాంబాబు

పేద ప్రజల ఆకలి తీరుస్తున్న రాంబాబు


 *నిడమర్రు గ్రామంలో లాక్ డౌన్ ప్రారంభం నుండి తన సొంత ఖర్చులతొ  పేద ప్రజలకు ప్రతి రోజు అన్నం వండి తీసుకొని వారి ఇళ్ళకు వెళ్ళి ఇస్తూ పేద ప్రజల ఆకలి తీరుస్తున్న అన్న దాత


 పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం నిడమర్రు గ్రామంలొ  కరోనా  వలన *లాక్ డౌన్* ప్రకటన చేసిన మూడవ రోజు నుండి నిడమర్రు గ్రామంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ గ్రామానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ గ్రామంలో సొంత ఖర్చులతో ప్రతి ఒక్కరికి ఫేస్ మాస్కూలు పంపిణీ చేయడం జరిగింది,ఇలానే బ్లీచింగ్ చిమ్మించడం, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. రెండవ విడతగా తిరిగి మాస్కులు‌ పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రతిరోజు రోజుకి 150 మందికి పైగా  భోజనం వండించి గ్రామంలొ ఉన్న పేద వారి ఇళ్లకు తీసుకొని వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా రాంబాబు సొంత ఖర్చులతో చేయడం జరిగింది.ప్రతిరోజు గ్రామంలొ ఉన్న ముసలి వారికి అన్నం ఇచ్చిన తరువాత వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవని జాగ్రత్తలు పాటించాలని  చెప్పి బయటకు రాకుండా ఉండమని సూచనలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన  విదంగా లాక్ డౌన్ మే మూడు వరకు భోజనాలు ఇలానే కొనసాగింపు చేసి పంపిణీ చేయడం జరుగుతుందని సంకెళ్ళరాంబాబు అన్నారు. పేదవారి  ఆకలి తీర్చే అదృష్టం దక్కినందుకు ఆనందంగా ఉందని ఈ సమయంలో ఇలాంటి మంచి అవకాశం నాకే దక్కిందని‌ రాంబాబు అన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు