మార్కెట్ ప్రాంతాన్ని శుభ్రం చేసిన రాజకుటుంబీకులు శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్ర  మరియు వారి అభిమానులు:

*పారిశుద్ధ్య కార్మికులు చేసే సేవలకు మద్దతుగా సంఘీభావం తెలియజేస్తూ కూరగాయల మార్కెట్ ప్రాంతాన్ని శుభ్రం చేసిన రాజకుటుంబీకులు శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్ర  మరియు వారి అభిమానులు:

          వెంకటగిరి  :   కరోన సంక్షోభంలో సైతం తమ ప్రాణాలను లెక్క చేయక నిరంతరం వెంకటగిరి పట్టణ ప్రజలకు విశిష్ట సేవలందిస్తున్న  మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేసే సేవలకు మద్దతుగా సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈరోజు ఉదయం రాజా వీధిలోని జెడ్పి బాలికోన్నత పాఠశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ప్రాంతాన్ని తాను తన అభిమానులు శుభ్రం చేసినట్లు వెంకటగిరి సంస్థానాధీశులు,, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, వైయస్సార్ సిపి నాయకులు శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరం ప్రభుత్వ ఆంక్షలను పాటిస్తూ, గృహ నిర్బంధంలో ఉండి, తప్పనిసరి అయితే తప్ప బజార్ కు వస్తూ, సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారి తో పాటు వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ మదర్ శా ఆలి, వైయస్సార్ సిపి వెంకటగిరి పట్టణ అధ్యక్షులు  గుమ్మలపు ఢిల్లీ బాబు, సీనియర్ న్యాయవాది, లక్కమనేని కోటేశ్వరరావు, రాజా గారి అభిమానులు గొల్లగుంట వెంకట ముని, గొల్లగుంట మురళి, కొండూరు కోటేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వరరావు, రమేష్, శ్రీధర్, మంగళపురి వెంకటేశ్వర్లు, రామకృష్ణ, మహిళా నాయకురాళ్లు శ్రీమతి ధనియాల రాధ, శ్రీమతి జలగం కామాక్షి, పూజిత మొబైల్ గంగాధర్, సాయి, వల్లబదాస్, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు