ఏ.పి.టి.యఫ్ ఉపాధ్యాయ సంఘంచే కూరగాయలు పంపిణీ

ఏ.పి.టి.యఫ్ ఉపాధ్యాయ సంఘంచే కూరగాయలు పంపిణీ


వింజమూరు, మే 5 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ద్య కార్మికులకు మంగళవారం స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘం నేతలు కూరగాయలు, బియ్యం, కోడిగుడ్లును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన తహసిల్ధారు యం.వి.కే సుధాకర్ రావు మాట్లాడుతూ వింజమూరు మండలంలో లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకు దాతలు ఎంతగానో సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు.  పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో పాటు పేదలను ఆదుకునేందుకు ఉపాధ్యాయులు సైతం ముందుకు వస్తుండటం పట్ల తహసిల్ధారు ఉపాధ్యాయులను పేదల పాలిట ఆపద్భాందవు లాంటి వారని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి బంకా.శ్రీనివాసులురెడ్డి, ఏ.పి.టి.యఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావూరి.సుధాకర్ రెడ్డి, ఏ.పి.టి.యఫ్ మండల శాఖ అధ్యక్షులు జక్కం.మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి.కొండారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు యం.శ్రీనివాసులురెడ్డి, జి.నారాయణ, ఎస్.కే.మదార్, పి.బసిరెడ్డి, లెక్కల.రవి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు