తూర్పు బోయమడుగుల కు మహర్దశ

తూర్పు బోయమడుగుల కు మహర్దశ
వరికుంటపాడు మే 11:


వరికుంటపాడు మండలం లో వెనుక బడిన పంచాయతీ గా పేరున్న తూర్పు బోయమడుగుల కు ఎట్టకేలకు మహర్దశ పట్టనుంది. పిల్లాపెరు వాగు కి మోటార్ లు బిగించి వ్యవసాయం చేసుకునే రైతులకు కొంత ఉపశమనం కలగనుంది. పంచాయతీ నడిబొడ్డున రూ 35 లక్షలతో గ్రామ సచివాలయ భవనం నిర్మిస్తుండటం,  సుమారు 20 లక్షలతో రైతు భరోసా కేంద్రo మంజూరు కావడం, రూ 13 లక్షల వ్యయం తో ఆరోగ్య ఉపకేంద్రం మంజూరు కావడం విశేషం. ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనం కు గ్రామం కు పడమర వైపు ఉన్న పిల్లపెరు వాగు ను దాటి పొలాలకు వెళాల్సిన పరిస్థితి ఉంది. వర్షకాలం వస్తే రైతులు ఇబ్బంది పడేవారు. అయితే జి  కొండారెడ్డి పల్లి నుండి తూర్పు బోయమడుగుల మీదుగా మండల కేంద్రమైన వరికుంటపాడు కి వెళ్లేందుకు సుమారు 13 లక్షలతో రోడ్డు కూడా మంజూరు అయింది. ఈ రోడ్డు కి అంతర్భాగం గా పిల్లపెరు పై చప్టా నిర్మించనున్నారు. ఈ నిర్మాణం పూర్తి అయితే రైతులకి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ పంచాయతీ కి మూడు చోట్ల ఇంటి నివేశన లేవుట్ లు ఏర్పాటు చేయడం జరిగింది. బడుగు వర్గాలు ఎక్కువ ఉన్న ఈ గ్రామం లో ఇంటి స్థలాల లేవుట్ వలన ఆర్థికంగా ధైర్యo ఏర్పడినట్టు అయింది. శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఈ పంచాయతీ ని అభివృద్ధి వైపు నడిపిస్తుండటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు