రాష్ట్రంలో పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, గిట్టుబాటు ధర కల్పన గురించి ముఖ్యమంత్రి కి లోకేష్ లేఖ

తేదీః 12-05-2020  
గౌరవనీయులైనఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు   
శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి  


         


         విషయం: రాష్ట్రంలో పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, గిట్టుబాటు ధర కల్పన గురించి 


  రాష్ట్రంలో పసుపు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు లాక్ డౌన్ నిబంధనలు, మరోవైపు అరకొర కొనుగోళ్లతో నష్టాలపాలు అవుతున్నారు. రాష్ట్రంలో 33వేల ఎకరాల్లో పసుపును సాగు చేశారు. 8.25 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. కడప, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో పసుపును అధికంగా సాగు చేశారు. ప్రభుత్వం పసుపు క్వింటాలుకు రూ.6,850ల గిట్టుబాటు ధర ప్రకటించినప్పటికీ రైతులకు మాత్రం ఆ ధర లభించడం లేదు. ఎన్నికలకు ముందు క్వింటా రూ.15వేలు ఉంటేగానీ పసుపుకు గిట్టుబాటు కాదని ఊదరగొట్టిన వైసీపీ.. ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు? ప్రస్తుత పరిస్థితుల్లో పసుపుకు కనీసం రూ.10వేలు ధర ఉంటే కానీ రైతుకు గిట్టుబాటు కాదు. కానీ ఇప్పటి ధరల ప్రకారం పెట్టిన పెట్టుబడులు కూడా రాక పసుపు రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు అప్పుల భారం వారిని మరింత కుంగదీస్తోంది. మార్క్ ఫెడ్, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయ లేమి ఉందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా వ్యాఖ్యానించడం ప్రభుత్వ అసమర్థతను, నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. రైతుల గురించి గొప్పగా మాట్లాడే వైసీపీ నేతల.. చేతలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. పసుపు రైతుల గోడు మీకు పట్టడం లేదా? మార్కెట్ లో క్వింటా పసుపుకు రూ.5 వేల నుంచి 5,400 ధర మాత్రమే లభిస్తోంది. ఈ లెక్కన మీరు ప్రకటించిన ధర ప్రకారమే పసుపు రైతులు క్వింటాకు రూ.1450 నుంచి రూ.1850 వరకు నష్టపోతున్నారు. 
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఇప్పటివరకు పెద్దగా కొనుగోళ్లు జరగలేదు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు నిజమని నమ్మి, ఎన్నో ఇబ్బందులు పడి పెద్ద ఎత్తున పండించిన పసుపుతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు  అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస ఏర్పాట్లు లేక, కొనుగోళ్లు జరగక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కొనుగోళ్లు ముమ్మరం చేయకపోవడంతో కొన్నిచోట్ల ఆరబెట్టిన పంట తడుస్తుందేమోనని రైతులు భయపడుతున్నారు. తుఫాను నేపథ్యంలో రైతుల  వద్ద ఉన్న మొత్తం పంటను ప్రభుత్వమే త్వరగా కొనుగోలు చేయాలి. లేనిపక్షంలో రైతులు నష్టపోతారు. మరోవైపు వర్షం కురిస్తే ఆరబెట్టుకునేందుకు టార్పాలిన్లు కొరతకూడా ఉంది. అటు నిల్వ చేసుకునేందుకు కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పసుపు రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈ-క్రాప్ లో సాగుకు మించి విస్తీర్ణం నమోదుకావడం కూడా అనుమానాలకు తావిస్తోంది. మీ ప్రభుత్వం దళారులకు కొమ్ముకాస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికైనా కష్టాల్లో ఉన్న పసుపు రైతులను తక్షణమే ఆదుకొండి. 


 



                                                                        ఇట్లు                                                                     నారా లోకేష్
                                                      తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు