కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లు పెంపు పై ఆందోళన....

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లు పెంపు పై ఆందోళన....


కావలి ,మే ,15 (అంతిమ తీర్పు-N. సాయి )


కావలి పట్టణం నందు  రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ sanghat స్టేట్ కో కన్వీనర్ జి కిరణ్ ఆదేశాలతో మరియు జోనల్ కోఆర్డినేటర్ కమల్ సూచనలతో నెల్లూరు జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ కోఆర్డినేటర్ వి శివ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కరెంటు బిల్లు పెంపుపై నిరసన కార్యక్రమం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘ కోఆర్డినేటర్ వెంకయ్య మరియు ప్రసాద్ పాల్గొని కావలి ఎలక్ట్రికల్ డి.ఈ  కె భాస్కర్ రెడ్డి కి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో  శివ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత 50 రోజుల నుంచి దేశ ప్రజలందరికీ ఈ మహమ్మారి నుండి కాపాడుటకు ఇళ్లలోనే లాక్ డౌన్లో చేసి బడుగు బలహీన ప్రజలకి మరియు అనేక రకములైన కార్మికులకు పని లేక పూట గడవటమే కష్టం గా ఉండే తరుణంలో ప్రజల మీద మోయలేని భారాన్ని కరెంటు  రూపం నా  గోరుచుట్టుపై రోకలి పోటు అనుసంధాన కరెంటు బిల్లులు విపరీతంగా పెంచడం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది అని మార్చి ఏప్రిల్ మే నెల బిల్లు పూర్తిగా మాఫీ చేయాలని జూన్ నుండి పాత విధానంలో పాత రేట్లతో కరెంటు బిల్లులు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది డిమాండ్ చేస్తుంది అన్నారు. అలా కాని పక్షంలో ప్రజల పక్షాన ఉండి కరెంటు బిల్లులు తగ్గేవరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు