ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా ( ఎన్ యూ జె) జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆనంద్ రాణా నియామకం

ప్రతిష్ఠాత్మక ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా ( ఎన్ యూ జె) జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆనంద్ రాణా  నియమితులయ్యారు. 
ఈ మేరకు  ప్రెస్ కౌన్సిల్ అధికారిక ప్రకటన ను విడుదల చేసింది. ఢిల్లీకి చెందిన ఆనంద్ రాణా  రెండు దశాబ్దాలుగా ఎన్ యు జె లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఆయన నియామకం పట్ల ఎన్ యూ జే  అధ్యక్ష కార్యదర్శులు రాస్ బిహారీ, ప్రసన్న మహంతి, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్  (జాప్ ) అధ్యక్ష కార్యదర్శులు ఎన్ డి వి ఆర్ ఎస్ పున్నం రాజు, యం. యుగంధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు