సీఎం జగన్‌ స్పందన అభినందనీయం: బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు.

                      Date: 09/05/2020
సీఎం జగన్‌ స్పందన అభినందనీయం: బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు.
అమరావతి : విశాఖపట్నం జిల్లాలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీ ఘటన మహా విషాదానికి కారణమైన గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై గ్యాస్‌ లీకేజీ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ వ్యవస్థలన్ని స్పందించిన తీరు అద్భుతమని బీజెపీ జిల్లా కార్యదర్శి వై.వి.సుబ్బారావు తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్షణ క్షణం సమీక్షించి స్పందించటం అభినందనీయం అన్నారు.  మృతుల కుటుంబాలకు గాని, బాధితులకు కానీ అందిస్తున్న ప్యాకేజీ ఉహించనిదని ఆయన తెలిపారు. నేనున్నా అని నిజమగానే బాధిత కుటుంబాల మనసుల్లో వైఎస్ జగన్ ఉండిపోయారని ఆయన చెప్పారు. కొందరు రాజకీయ నేతలు, పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు అనాగరికమని వై.వి. సుబ్బారావు మండిపడ్డారు. 
ఎల్‌జీ పాలిమర్స్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు అగ్నిమాపక దళం, పోలీసులు చమటోడుస్తున్నారని,  ప్రమాద తీవ్రత తెలిసినా ఏమాత్రం లెక్క చేయకుండా పరిస్థితిని పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టారని, కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఫోమ్‌ చల్లుతూ పరిసరాల్లో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకొంటున్నారని వీరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ప్రమాదానికి కారణమైన ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమలో  స్టైరీన్‌ మోనోమర్‌ విషవాయువులీకై 12 మందిని పొట్టన పెట్టుకుందని, వందల మందిని ఆస్పత్రి పాల్జేసిన దుర్ఘటనకు కారణమైన కంపెనీ పై న్యాయవిచారణ జరిపించాలని బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు డిమాండ్ చేశారు. మానవ తప్పిదంవలన ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుందని, ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ యాజమాన్యం కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించినదని ఆరోపించారు. సిట్టింగ్ జడ్జీ తో కమిటీ వేచి న్యాయవిచారణ చేపట్టాలని కోరారు.గ్యాస్ ప్రభావానికి గురైన వారు తమ జీవితకాలం ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. భాదితులు అందరూ నిరుపేదలని, వీరు జీవితకాలం వైద్య ఖర్చులు భరించడం కష్టం అయినందున, వీరికి ప్రత్యేక ఆరోగ్య కార్డులు ఏర్పాటుచేసి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు డిమాండ్ చేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు