ఎస్.ఐ బాజిరెడ్డికి దళిత సంఘాల నేతల అభినందనలు

*ఎస్.ఐ బాజిరెడ్డికి దళిత సంఘాల నేతల అభినందనలు* వింజమూరు, మే 13 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి జన్మదినోత్సవమును పురస్కరించుకుని బుధవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో దళిత సంఘాల నేతలు ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏ.పి యం.ఆర్.పి.ఎస్ నేత బూదాల.ప్రేమదాస్ మాదిగ మాట్లాడుతూ విధి నిఫ్వహణలో భాగంగా ఎస్.ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు అందించిన సేవలు మరువరానివన్నారు. యేడాది వ్యవధిలో ఎస్.ఐ బాజిరెడ్డి నిర్వహించిన కర్తవ్య భాధ్యతలు పోలీసు శాఖ కీర్తి ప్రతిష్టలను మరింతగా ఇనుమడింపజేశాయని కొనియాడారు. ఆయన విలక్షణ వ్యక్తిత్వం మండల ప్రజలను మంత్రముగ్ధులను చేశాయనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదేమోనని ప్రేమదాస్ మాదిగ అభిప్రాయపడ్డారు. ఏ.డి.పి.ఎస్ నేత మూర.పెద్దన్న మాట్లాడుతూ ఎస్.ఐ బాజిరెడ్డి అనతికాలంలోనే మండల ప్రజల ఆదరాభిమానాలు చూరగొనడం గొప్ప విషయమన్నారు. ఆయన జన్మదినోత్సవమును ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని తాము ఆశించామన్నారు. కానీ ఆయన మాత్రం అందుకు అయ్యే ఖర్చుతో పేదలకు అన్నదానం చేయాలని సూచించి పేదల పక్షపాతిగా నిలిచారన్నారు. ఆయన ఆదేశాలను తాము తప్పకుండా పాటిస్తామన్నారు. అందులో భాగంగా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండానే కేక్ కట్ చేసి ఎస్.ఐ బాజిరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాం క్షలు తెలియజేయడం జరిగిందన్నారు. మండల ప్రజల పట్ల ఎంతో గౌరవ మర్యాదలు చూపుతూ అందరి మన్ననలు పొందుతున్న ఎస్.ఐ బాజిరెడ్డి పది కాలాల పాటు వింజమూరులోనే సేవలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు గుజ్జు.చెన్నయ్య, రామ్మోహన్, తిరిపాలు, పెద్దేటి.చెన్నయ్యలు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు