పౌష్ఠిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి : సీడీపీఓ

పౌష్ఠిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి*
*సీడీపీఓ
వరికుంటపాడు 
అంగన్వాడీ కేంద్రం నుండి అందుకునే పౌష్ఠిక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని గర్భవతులు బాలింతలకు ఉదయగిరి సీడీపీఓ ఈస్టర్ రాణి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె కాంచెరువు, గువ్వడి, ఇస్కపల్లి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న బలవర్దక ఆహారాన్ని తప్పకుండ ఆహరం గా తీసుకోవాలన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించి వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలన్నారు. రక్త హీనత నివారణ కోసం తాజా పండ్లు, ఆకుకూరలను వినియోగించాలన్నారు. ఈ సందర్బంగా కాంచెరువు  అంగన్వాడీ కార్యకర్త పై గ్రామస్థులు అనేక పిర్యాదులు చేశారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీ కార్యకర్తలు మేడిశెట్టి విజయమ్మ, కాకి రూతమ్మ, కాకి భవాని, ఆశ కార్యకర్తలు ఉలసా  భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు