నా డ్రైవర్ వాహనాన్నే నిలువరిస్తారా...మీ సంగతి చూస్తా... పోలీసు సిబ్బందిపై ఇరిగేషన్ ఏ.ఈ ఆగ్రహం

నా డ్రైవర్ వాహనాన్నే నిలువరిస్తారా...మీ సంగతి చూస్తా... పోలీసు సిబ్బందిపై ఇరిగేషన్ ఏ.ఈ ఆగ్రహం


వింజమూరు, మే 2 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నా డ్రైవర్ వాహనాన్నే నిలువరిస్తారా...10 నిమిషాలు ఆగండి, మీ సంగతి చూస్తా, నేనేంటో చూపిస్తానంటూ భాధ్యతాయుతమైన మండల స్థాయి ప్రభుత్వ ఉద్యోగి పోలీస్ సిబ్బందిని హెచ్చరించిన సంఘటన వింజమూరులో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలలోకి వెళితే వింజమూరులోని బంగ్లాసెంటర్ కూడలిలో కరోనా వైరస్ నివారణా చర్యలలో భాగంగా స్థానిక పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సుమారు రాత్రి 8:30 గంటల సమయంలో కలిగిరి ఇరిగేషన్ శాఖ ఏ.ఈ డ్రైవర్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా బంగ్లాసెంటర్ వద్ద పోలీసులు తమ తనిఖీలలో భాగంగా ఎక్కడ నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించారు. దీంతో డ్రైవర్ నేను కలిగిరి ఇరిగేషన్ ఏ.ఈ డ్రైవర్ గా ఉంటున్నానని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో పాటు ఏ.ఈ రమేష్ కు ఫోన్ చేశారు. అదే సందర్భంలో అటుగా వెళుతున్న ఎస్.ఐ బాజిరెడ్డి గమనించి అక్కడకు చేరుకుని ఏంటని అడిగారు. అంతలో హుటాహుటిన ద్విచక్ర వాహనంపై నేరుగా ఇరిగేషన్ ఏ.ఈ బంగ్లాసెంటర్ కు చేరుకున్నారు. అంతలో ఎస్.ఐ మీరెవరండీ అని ప్రశ్నించే లోగా నీ దగ్గరకే వస్తున్నా ఉండండి  నేనేంటో చూపిస్తానంటూ సెల్ ఫోన్ చేతబట్టుకుని ఎవరివరికో ఫోన్లు చేయడం ప్రారంభించారు. అనంతరం ఎస్.ఐ బాజిరెడ్డి వద్ద కొంతసేపు హల్ చల్ చేశారు. ఇందంతా ఓపిగ్గా గమనించిన ఎస్.ఐ అసలు మీరు ఎవరండీ అని సున్నితంగా ప్రశ్నిచగా నేను ఇరిగేషన్ ఏ.ఈ ని అంటూ సమాధానమిచ్చారు. ఐడెంటిటీ కార్డును చూపించారు. ఎస్.ఐ మాట్లాడుతూ మీరు భాధ్యతాయుతమైన మండల స్థాయి అధికారిగా ఉంటూ ఇలా మా సిబ్బందితోనూ, నాతో సైతం నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడం సబబు కాదన్నారు. మీకు అరగంట టైం ఇస్తున్నాను, మీరు ఎవరెవరికి 
ఫోన్లు చేసుకుంటారో చేసుకోండి, ఈ కరోనా సమయంలో మేము మా కుటుంబాలకు దూరంగా ఉంటూ మీ కుటుంబాల రక్షణకు రాత్రింబవళ్ళు రోడ్లు వెంబడి అర్ధాకలితో పడిగాపులు కాస్తుంటే మీకు ఎగతాళిగా ఉందా అంటూ ప్రశ్నించారు. అనంతరం ఏ.ఈ డ్రైవర్ ద్విచక్ర వాహనానికి రికార్డులు చూపించకపోవడంతో నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అప్పటి వరకు బంగ్లాసెంటర్ వద్ద హల్ చల్ చేసిన ఏ.ఈ పోలీస్ స్టేషన్ కు చేరుకుని పొరపాటు జరిగిందని ఎస్.ఐ ను బ్రతిమిలాడుకున్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి ఇరిగేషన్ ఏ.ఈ రమేష్ తో మాట్లాడుతూ ఈ కరోనా విపత్తు సమయంలో మీరిలా విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల పట్ల భాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం సరి కాదంటూ సున్నితంగా మందలించి పంపించివేశారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు