పేదలకు చుండి హరిగోపాల్ రెడ్డి చేయూత

పేదలకు చుండి.హరిగోపాల్ రెడ్డి చేయూత


 దుత్తలూరు, మే 7 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): దుత్తలూరు మండలంలోని పలు ప్రాంతాలలో గురువారం నాడు బి.జె.పి మండల శాఖ అధ్యక్షులు చుండి.హరిగోపాల్ రెడ్డి నేతృత్వంలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరిగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విస్తరించి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదన్నారు. ప్రధానమత్రి నరేంద్రమోదీ సాహసోపేతమైన నిర్ణయంతో మన దేశంలో కొంతమేర కరోనా విజృంభణను కట్టడి చేయగలిగామన్నారు. కరోనా ముప్పును ముందుగానే పసిగట్టిన ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూతో ప్రజలను ఏకతాటిపై నడిపించగలిగారన్నారు. ఆర్ధిక వ్యవస్థ పతనమవుతున్నప్పటికీ లెక్క చేయకుండా ప్రజల సం క్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలు, నిర్ణయాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అంశాలుగా పరిగణించవచ్చునన్నారు. ఈ సందర్భంగా పలువురు యువకులు చుండి.హరిగోపాల్ రెడ్డి అధ్వర్యంలో బి.జె.పి తీర్ధం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమాలలో అంత్యోదయ మున్సిపల్ కో-ఆర్డినేటర్ మేకపాటి.మాల్యాద్రినాయుడు, సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు