వాలంటీర్ నుంచి కలెక్టర్ వరకు అందరూ కలసి సమన్వయంతో పని చేయడం వల్లే ఇలాంటి మరణాలు లేవు : రోజా

 


చిత్తూరు, మే 11 (అంతిమ తీర్పు) : నేను పుట్టిన ఊరు కాకుండా నన్ను రెండు సార్లు అభిమానించిన ఊరు ప్రజల కోసం వారి ఇబ్బందులు పడుతుంటే వారికి సేవ చేయాలని భావించాను అందులో భాగంగానే ప్రజల సహాయం పలు పనులు చేపట్టానని నగిరి శాసనసభ్యురాలు మరియు ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా అన్నారు. ఏడు చిత్తూరులో కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో జిల్లా యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఎస్పీ సెంథిల్ కుమార్ ల ఆధ్వర్యంలో బాగా పని చేశారని వాలంటీర్ నుంచి కలెక్టర్ వరకు అందరూ కలసి సమన్వయంతో పని చేయడం వల్లే ఇలాంటి మరణాలు లేకుండా దాదాపు బాధితుల అందరి ఇంటికి పంపారని అయితే ఇదే సమయంలో చెన్నై కోయంబేడు మార్కెట్ కు సంబంధించి కేసులు రావడం బాధగా ఉందని అయినా జిల్లా యంత్రాంగం ఈ సమస్యను కూడా కట్టడి చేయడం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా ను కట్టడి చేయడంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ అధికారులతో సంప్రదించి దిశానిర్దేశం చేస్తూ దేశంలోని అత్యధికంగా పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రజల ఆరోగ్యం భాగ్యంగా ఆయన పని చేస్తున్నారని అదేవిధంగా విశాఖలో జరిగిన సంఘటన ఆయన వ్యవహరించిన తీరు అదేవిధంగా ఆ కుటుంబాలను అక్కున చర్చుకొన్నే విధానం చూసి యావత్ దేశం అబ్బుర పడుతోందని ఎమ్మెల్యే రోజా అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో నియోజకవర్గానికి సంబంధించిన పరిశ్రమల అనుమతులు గురించి అదేవిధంగా కరుణ ప్రభావంతో భౌతిక దూరం గురించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు