సీతారామపురంలో మద్యం విక్రయాలపై మహిళల ఆగ్రహం...

మాయదారి మద్యం మాకొద్దు బాబోయ్... జగనయ్యా మా మొర ఆలకించవయ్యా


... సీతారామపురం, మే 6 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): మాయదారి మద్యం మాకొద్దు, ఆర్ధికంగా మా కుటుంబాలు చితికిపోతున్నాయి, నీ ఇంటి ఆడపడుచుల లాంటి వాళ్ళం చెబుతున్నాం... ఈ మద్యం షాపులను మూసి వేయించయ్యా అంటూ మహిళలు నేరుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ నిరసనకు దిగిన సంఘటన నెల్లూరుజిల్లా సరిహద్దు ప్రాంతమైన సీతారామపురంలో చోటు చేసుకుంది. గత 3 రోజుల వరకు నగరాల నుండి మారుమూల ప్రాంతాలలో ఉంటున్న ప్రజలు వరకు కరోనా వైరస్ పుణ్యమా అని లాక్ డౌన్ విధించడంతో నివాసాలకే పరిమితమై స్వీయ నిర్భంధం పాటిస్తూ నేటికీ అదే బాటలో పయనిస్తున్నారు. లాక్ డౌన్ షరతులు మద్యం షాపులకు సైతం వర్తించడంతో గత 40 రోజులుగా మద్యం షాపులను ప్రభుత్వం బంద్ చేసింది. ఇంతలోనే ఏం కొంపలు అంటుకుపోతున్నట్లు, మద్యం లేనిదే ముద్ద దిగదన్నట్లు లాక్ డౌన్ ముగియక ముందే ఆఘమేఘాల మీద మద్యం షాపులు తీసేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇంకేముంది మందుబాబులు మద్యం షాపుల ముందు బారులు తీరారు. ఒకేసారి అందిన కాడికి ఫూటుగా మద్యం సేవించి చిందులేయడంతో మహిళాలోకానికి చిర్రెత్తింది. ఫలితంగా మద్యం షాపులు మూసేయాలంటూ ధర్నాకు దిగారు. మీ ఆదాయం కోసం మా కుటుంబాలను పావులుగా వాడుకోవడం సబబు కాదంటూ పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లేసి గెలిపించినందుకు ఇలా ఇబ్బందులు పెడుతున్నావా నాయనా అని వృద్ధులు విలపించారు. నిన్న మొన్నటి వరకు గుట్టుగా కొంపలోనే పడి వున్న తమ బిడ్డలు నేడు మద్యం సేవించి ఇళ్ళ వద్ద కోడళ్ళతో గొడవలకు దిగుతుంటే ఏ తల్లి గుండె అయినా తల్లడిల్లిపోదా అని వారు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా మద్యం ధరల పెంపుపై
 మందుబాబులు కూడా చిర్రుబుర్రులాడుతున్నారు. ఈ విధంగా రోజుకో రకంగా ధరలు  పెంచుకుంటూ పోతుండటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ధరలు పెంచితే సామాన్యులు మద్యం జోలికి పోరనేది ఒక అపోహ మాత్రమేనని పలువురు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు