అర్చకులకు తిప్పిరెడ్డి.నారపరెడ్డి ఆర్ధికసాయం

అర్చకులకు తిప్పిరెడ్డి.నారపరెడ్డి ఆర్ధికసాయం


వింజమూరు, మే 7 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరులో పలు దేవస్థానాలలో పనిచేస్తున్న అర్చకులకు గురువారం నాడు మండల వై.సి.పి కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి 5 వేల రూపాయల ఆర్ధిక సహాయమును అందజేశారు. ఊ సందర్భంగా స్థానిక శివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వింజమూరు మంXఅలంలో పురాతన చరిత్రలు కలిగిన ఆలయాలు ఉన్నాయన్నారు. తమ పూర్వీకుల కాలం నుండి కూడా అర్చక కుటుంబాలు ఎంతో గౌరవ మర్యాదలు కలిగి ఉండేయన్నారు. తాము నేటికీ బ్రాహ్మణులకు ఎంతగానో సేవలందిస్తున్నామన్నారు. ప్రస్తుతం కనీవినీ ఎరుగని రీతిలో పెను ముప్పుగా పరిణమించిన కరోనా మహమ్మారితో ఎటు చూసినా కర్ఫ్యూ విధించడం జరిగిందన్నారు. లాక్ డౌన్ వలన ఆలయాలు దీప ధూప నైవేద్యాలు మినహా భక్తులు విశేషంగా పూజలు నిర్వహించే పరిస్థితులు లేవన్నారు. ఫలితంగా అర్చకుల కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తుతున్న విషయాలను గమనించి తన వంతు సాయంగా కొంత నగదును అందజేయడం జరిగిందన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు