కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ చే బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ

కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ చే బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ


వింజమూరు, మే 7 (అంతిమ తీర్పు - దయాకర్ రెడ్డి): వింజమూరులోని పలు దేవస్థానాలలో పనిచేస్తున్న భ్రాహ్మణులకు గురువారం నాడు కే.జి.ఆర్.వి.యస్ (కొండా.గరుడయ్య, రా.అచంద్రయ్య, వెంకటసుబ్బయ్య) చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో బియ్యం, కూరగాయలు, వంటనూనెలు పంపిణి చేశారు. స్థానిక శివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తహసిల్ధారు సుధాకర్ రావు మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణా చర్యలలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. దేవస్థానాలకు సైతం లాక్ డౌన్ నిబంధనలు వర్తించడంతో ఆలయాలకు భక్తుల తాకిడి తగ్గిందన్నారు. ఈ నేపధ్యంలో అర్చకులు చాలీచాలని జీతాలతోనే కుటుంబ పోషణ సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ తరుణంలో వింజమూరు మాజీ ఉప సర్పంచ్ కొండా.వెంకటేశ్వర్లు దంపతులు బ్రాహ్మణులకు నిత్యావసరాలను ట్రస్ట్ అధ్వర్యంలో అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మండల తహసిల్ధారును ఆర్యవైశ్యులు శాలువాతో సత్కరించారు. ఇదిలా ఉండగా కొంతమంది ఆర్యవైశ్యులు బ్రాహ్మణులకు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షులు గణపం.బాలక్రిష్ణారెడ్డి, మండల వై.సి.పి కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి, కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ ప్రతినిధులు కొండా.బాలసుబ్రహ్మణ్యం, కొండా.వెంకటసుబ్బారావు, కొండా.సుబ్బరాయుడు, కొండా.సుమన్, ఆర్యవైశ్య సంఘం నేతలు చవల.వెంకట సత్యనారాయణ, కొండా.జయబాబు, పొన్నూరు.ప్రకాశం, సుమంగళి శారీస్ లక్ష్మీనారాయణ, కటకం.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు