మండల టీమ్లు కోయంబేడు కాంటాక్ట్ లు పై దృష్టి పెట్టాలి

 


మండల టీమ్లు కోయంబేడు కాంటాక్ట్ లు పై దృష్టి పెట్టాలి.


కేసులు నమోదు అయినా భయపడాల్సిన పనిలేదు, రెడ్ జోన్ నియమాలను పాటించండి.. జిల్లా కలెక్టర్, సత్యవేడు శాసనసభ్యులు


నాగలాపురం, పిచ్చాటూరు, మే 12 : జిల్లాలో కోయంబేడు మార్కెట్ తో సంబంధాలు వున్న కేసులు నమోదు జరుగుతున్నాయని, ఇప్పటికే మార్కెట్ తో సంబంధాలు వున్నవారిని జాబితా మేరకు కోవిడ్ స్యాబ్ పరీక్షలు నిర్వహణ జరుగుతున్నదని రెడ్ జోన్ లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త తెలిపారు. మంగళవారం మద్యాహ్నఁ నాగలాపురం, పిచ్చాటూరు మండల కేంద్రాల్లో పాజిటివ్ నమోదు ప్రాంతాలను సత్యవేడు శాసన సభ్యులు ఆదిమూలం కలసి జిల్లా కలెక్టర్ పర్యటించారు. రెడ్ జోన్లలో శానిటేషన్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  పాజిటివ్ కేసులు నమోదు అయిన మాత్రాన భయపడాల్సిన పనిలేదని ప్రజలు జాగ్రత్తలు పాటించి ఇంటికే పరిమితం కావాలని సూచించారు. కోయంబేడు కాంటాక్ట్ జాభితా గుర్తించి మండలాల వారిగా పంపించడం జరిగిందని, సెకండరీ కాంటాక్ట్ పై దృష్టి పెట్టాలని, 60 సం. పైబడిన వారిని తప్పనిసరి టెస్టులు చేయాలని, నెగటివ్ వున్నా క్వారేంటైన్ కు పంపాలని సూచించారు.  భౌతిక దూరం, మాస్కులు వంటి జాగ్రత్తలు
అలవాటు చేసుకోవాలని సూచించారు. బయట రాష్ట్రంలో ఉన్న మనవాళ్లు స్వంత గ్రామాలకు రానున్నారని, వారి క్వారేంటైన్ కోసం ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు 4900 గుర్తించి 20,000 మందికి సరిపడా వసతి,  బస 14 రోజులపాటు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కోయంబేడు కాంటాక్ట్ లు ఏఒక్కరు తప్పిపోకుండా గుర్తింపు, బయటి ర్రాష్టాల నుండి రానున్న మన జిల్లా వాసులకు క్వారేంటైన్ భాద్యత తహసీల్దార్ లు చూడాలని సూచించారు. జిల్లాకు రానున్న ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.


జిల్లా కలెక్టర్ పర్యటన లో మండల అధికారులు, వైద్య అధికారులు, పోలిస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


 


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు