ప్రమాదానికి కారణమైన స్టెరిన్‌ రసాయనాన్ని విశాఖపట్నంలో ఉంచడానికి వీల్లేదని స్పష్టంచేసిన సీఎం. 

*10–05–2020*
*అమరావతి*


*విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై సాయంత్రం మరోమారు సీఎం సమీక్ష*
*కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్*


*విశాఖపట్నం :* 
*విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై ఆదివారం సాయంత్రం మరోమారు సీఎం సమీక్ష*
*విశాఖలో ఉన్న ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు
,సీఎస్‌ నీలం సాహ్ని, ఇటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సీఎం సమీక్ష*
పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందంటూ సీఎంకు వివరణ
*మంత్రులకు, అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి*


– గ్యాస్‌ బాధితులు ఇళ్లకు చేరుకునేలా పరిస్థితులను మెరుగుపరచాలని సీఎం ఆదేశం


–*రేపు ఉదయం నుంచి ప్రభావిత గ్రామాల్లో ఇంటా, బయటా కూడా పూర్తిస్థాయిలో రసాయనాల అవశేషాలు లేకుండా శానిటేషన్‌ కార్యక్రమాలు  చేపట్టాలని సీఎం ఆదేశం*


–*సాయంత్రానికి ప్రజలు ఇళ్లకు చేరేలా చూడాలని సీఎం ఆదేశం.* 
*వారికి ధైర్యాన్ని ఇచ్చేందుకు మంత్రులు ఆయా గ్రామాల్లో రాత్రి బస చేయాలన్న ముఖ్యమంత్రి.*


– ఆస్పత్రిలో వైద్యం తీసుకుని, డిశ్చార్జి అవుతున్న ప్రజలు తిరిగి ఇళ్లకు చేరేంతవరకూ ప్రతి ఒక్కరి బాధ్యతను తీసుకోవాలని ఆదేశాలు.
 వారికి మంచి సదుపాయాలు అందేలా చూడాలని, తర్వాత కూడా వారికి వైద్య సేవల విషయంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలన్న సీఎం.


– రేపు ఉదయం మంత్రులు, అధికారులు కలిసి మరణించిన వారి 
కుటుంబాలకు ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశం.


– గ్యాస్‌ లీక్‌ కారణంగా ప్రభావితమైన వారికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆర్థిక సహాయం కోసం ప్రజలెవ్వరూ ఎక్కడా కూడా తిరగకుండా వారికి నేరుగా గ్రామ వాలంటీర్ల ద్వారా డోర్‌డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం.
పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టాలన్న సీఎం. 


– తమకు అందాల్సిన సహాయం కోసం ప్రజలు ఎవ్వరూ కూడా పదేపదే విజ్ఞాపనలు చేసే పరిస్థితి ఉండకూడదని స్పష్టంచేసిన ముఖ్యమంత్రి. 


– పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందన్న అంశాన్ని నిపుణులు కూడా చెప్తున్నారంటూ సీఎంకు వివరణ.
 అయినా సరే.. ఇంతటి ప్రమాదానికి కారణమైన స్టెరిన్‌ రసాయనాన్ని విశాఖపట్నంలో ఉంచడానికి వీల్లేదని స్పష్టంచేసిన సీఎం.
వివిధ ట్యాంకుల్లో, ఇతరత్రా చోట్ల ఉన్న స్టెరిన్‌ రసాయనాన్ని వెనక్కి పంపాలని సీఎం గట్టి ఆదేశాలు.
 కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంచేసుకుని ఈ పనిపూర్తిచేయాలన్న సీఎం.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు